కువైట్:జైలు నుంచే స్కెచ్..రాయల్స్, బిజినెస్ పర్సన్స్ కు లక్షల్లో టోకరా
- February 01, 2020
కువైట్:ఎనిమిది మంది టీం. జైలు నుంచే స్కెచ్. మాయమాటలు చెప్పి రాయల్స్ తో పాటు బిజినెస్ పర్సన్స్ ని బురిడి కొట్టించి కోట్ల రూపాయలు దోచుకున్నారు. ఈ బిగ్ ఫ్రాడ్ కేసులో విచారణను క్రిమినల్ కోర్టు మార్చి 11వ తేదికి వాయిదా వేసింది. మొత్తం KD2,593,399 మనీ లాండరింగ్ పాల్పడినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ ఆరోపిస్తోంది. ప్రస్తుతం ప్రధాని నిందితుడితో ఏడుగురు నిందితులు పలు చీటింగ్ కేసుల్లో జైలులో ఉన్నారు. అయితే..ఓ మహిళలను 400,000 కువైట్ దినార్ లను ఫ్రాడ్ చేసిన కేసులో నిన్న క్రిమినల్ కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా తన వాదన వినిపించిన బాధితురాలు ఓ రిప్రజెంటీవ్ ద్వారా వస్తువులు కొనేందుకు 400,000 కువైట్ దినార్ ల చెక్ ఇచ్చినట్లు వెల్లడించింది. అయితే..తనకు లగ్జరీ కార్ తో పాటు విలువైన గిఫ్ట్స్ ఇచ్చారని, డబ్బులు కూడా తిరిగి ఇస్తానని నిందితులు తనతో చెప్పారని ఆమె కోర్టుకు వివరించింది. అయితే..నిందితులు ఉద్దేశ్యపూర్వకంగా మోసానికి పాల్పడినట్లు కూడా పబ్లిక్ ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ చెబుతోంది.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







