కువైట్:జైలు నుంచే స్కెచ్..రాయల్స్, బిజినెస్ పర్సన్స్ కు లక్షల్లో టోకరా
- February 01, 2020
కువైట్:ఎనిమిది మంది టీం. జైలు నుంచే స్కెచ్. మాయమాటలు చెప్పి రాయల్స్ తో పాటు బిజినెస్ పర్సన్స్ ని బురిడి కొట్టించి కోట్ల రూపాయలు దోచుకున్నారు. ఈ బిగ్ ఫ్రాడ్ కేసులో విచారణను క్రిమినల్ కోర్టు మార్చి 11వ తేదికి వాయిదా వేసింది. మొత్తం KD2,593,399 మనీ లాండరింగ్ పాల్పడినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ ఆరోపిస్తోంది. ప్రస్తుతం ప్రధాని నిందితుడితో ఏడుగురు నిందితులు పలు చీటింగ్ కేసుల్లో జైలులో ఉన్నారు. అయితే..ఓ మహిళలను 400,000 కువైట్ దినార్ లను ఫ్రాడ్ చేసిన కేసులో నిన్న క్రిమినల్ కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా తన వాదన వినిపించిన బాధితురాలు ఓ రిప్రజెంటీవ్ ద్వారా వస్తువులు కొనేందుకు 400,000 కువైట్ దినార్ ల చెక్ ఇచ్చినట్లు వెల్లడించింది. అయితే..తనకు లగ్జరీ కార్ తో పాటు విలువైన గిఫ్ట్స్ ఇచ్చారని, డబ్బులు కూడా తిరిగి ఇస్తానని నిందితులు తనతో చెప్పారని ఆమె కోర్టుకు వివరించింది. అయితే..నిందితులు ఉద్దేశ్యపూర్వకంగా మోసానికి పాల్పడినట్లు కూడా పబ్లిక్ ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ చెబుతోంది.
తాజా వార్తలు
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్







