దిశ యాప్తో తొలి కేసు..
- February 12, 2020
ఆంధ్రప్రదేశ్లో దిశ యాప్తో తొలి కేసు నమోదైంది. మంగళవారం ఉదయం ఓ మహిళా అధికారి విశాఖపట్నం నుంచి విజయవాడకు బస్సులో వెళ్తుండగా.. తోటి ప్రయాణికుడొకరు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆ మహిళ వెంటనే దిశ యాప్ ద్వారా పోలీసులకు సమాచారాం ఇచ్చింది. వెంటనే స్పందించిన పోలీసులు రంగంలోకి దిగి.. ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు.
వేధింపులకు గురైన మహిళ ఫిర్యాదు అందిన 6 నిమిషాల్లోనే ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం విశేషం. ఉదయం 04.21 గంలకు మంగళగిరి దిశ కాల్ సెంటర్కు ఈ కాల్ వెళ్లింది. అక్కడి నుంచి కాల్ సెంటర్ ద్వారా దగ్గరలోని ఎమర్జెన్సీ సెంటర్కు సమాచారమందింది. రంగంలోకి దిగిన ఏలూరు త్రీటౌన్ పోలీసులు 04.27 నిమిషాలకు బాధితురాలి వద్దకు చేరుకున్నారు. నేరుగా బస్సులోకి వెళ్లి వేధింపులకు పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. అనంతరం జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మహిళా అధికారిణి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఆ వ్యక్తిని ప్రొఫెసర్గా గుర్తించారు.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







