బహ్రెయిన్: ఫైనల్ ఫిటీషన్ ఛాన్స్ కొల్పోయిన టెర్రరిస్ట్ గ్రూప్..యావజ్జీవ శిక్ష ఖరారు
- February 14, 2020బహ్రెయిన్ ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్న 12 మందికి గతంలో విధించిన శిక్షలు ఖరారయ్యాయి. గతంలో ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటీషన్ ను కోర్ట్
ఆఫ్ కసెషన్ కొట్టివేసింది. దీంతో శిక్ష నుంచి తప్పించుకునేందుకు టెర్రరిస్ట్ గ్యాంగ్ కు ఉన్న అన్ని దారులు మూసుకుపోయాయి. టెర్రరిస్ట్ సెల్ ఏర్పాటు తో పాటు కిడ్నాప్, టార్చరింగ్, దేశంలో టెర్రరిస్ట్ ప్రమోషన్ కు సాయం అందించటం, దోపిడి, వేధింపులు ఇలా పలు రకాల అభియోగాలతో 12 మందికి గతంలో శిక్షలు ఖరారయ్యాయి. ఇందులో ఇద్దరికి యావజ్జీవ కారగార శిక్ష పడగా 8 మందికి 15 సంవత్సరాల జైలు శిక్ష విధించింది కోర్టు. మరో ఇద్దరికి పదేళ్ల జైలు శిక్ష పడింది. కోర్టులో రికార్డులు ప్రకారం..12 మంది కలిసి 'సిక్రెట్ ఇంటలిజెన్స్ సర్వీస్ ఆఫ్ బహ్రెయిన్ రెవల్యూషన్' పేరుతో టెర్రరిస్ట్ గ్రూప్ ను ఏర్పాటు చేశారు. యువతను ఉగ్రవాదం వైపు అకర్షించేలా ప్రేరేపించటంతో పాటు పలు అరాచకాలకు పాల్పడుతూ వస్తున్నారు. ముఖ్యంగా పోలీసులకు సహకరించే వ్యక్తులను టార్గెట్ చేసేవారు. వారిని కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేయటంతో పాటు ఫ్యూచర్ లో పోలీసులకు సహకరించొద్దని బెదిరించేవారు. ఉగ్రవాదానికి అనుకూలించేలా వారితో కన్ఫెక్షన్ చెప్పించేవారని ఆరోపణలు ఉన్నాయి. వేర్వేరు ఘటనల్లో పోలీసులకు కోఅపరేట్ చేసే నలుగురు వ్యక్తుల్ని కిడ్నాప్ చేసి టార్చర్ చేసినట్లు పోలీసుల ఇన్వేస్టిగేషన్ లో తేలింది.
తాజా వార్తలు
- మే నెలలో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
- విద్యార్థులపై లైంగిక వేధింపులు.. టీచర్కు 15 ఏళ్ల జైలుశిక్ష
- మనీలాండరింగ్..పౌరులు, ప్రవాసుడు అరెస్ట్
- నాలెడ్జ్ ఒమన్ అకాడమీ ప్రారంభం
- వేసవి కొత్త సీజన్ ప్రారంభం.. 40°Cకు ఉష్ణోగ్రతలు
- భారీ వర్షాలు.. నివాసితుల ముందస్తు జాగ్రత్తలు..!
- పారిశ్రామిక చట్టాల ఉల్లంఘన..11సంస్థలు మూసివేత
- తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..
- తెలంగాణ: వడదెబ్బకు ఐదుగురు మృతి.. ఇవాళ, రేపు జాగ్రత్త
- తెలంగాణలో ప్రధాని మోదీ భారీ బహిరంగ సభ.. ఏర్పాట్లు పూర్తి