చైనా నుంచి వచ్చేవారిపై పూర్తి బ్యాన్
- February 14, 2020బహ్రెయిన్:గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ జారీ చేసిన డెసిషన్ నేపథ్యంలో చైనా నుంచి వచ్చే ప్రయాణీకులపై పూర్తిస్థాయిలో బ్యాన్ విధించనున్నారు. 14 రోజులకు ముందుగా ఎవరైతే చైనాలో పర్యటిస్తారో, వారికి బహ్రెయిన్లో ప్రవేశం ఇకపై వుండదు. కరోనా వైరస్ (కోవిడ్19) తీవ్రత నేపథ్యంలో బహ్రెయిన్ ఈ నిర్ణయం తీసుకుంది. క్రౌన్ ప్రిన్స్, డిప్యూటీ సూప్రీమ్ కమాండర్, ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా నేతృత్వంలోని గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కాగా, బహ్రెయినీ పౌరులు, జిసిసి దేశాలకు చెందిన పౌరులు, బహ్రెయినీ రెసిడెంట్స్, గత 14 రోజుల్లో చైనా వెళ్ళి వుంటే, వారు ఖచ్చితంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచన మేరకు వైద్య పరీక్షలు చేయించుకోవాలి.
తాజా వార్తలు
- జూన్ 1 నుంచి సింగిల్ యూజ్ బ్యాగులపై నిషేధం
- 2025-26 నాటికి ఇంటింటికి ఎగిరే కార్లు..!
- బహ్రెయిన్ సమ్మిట్కు అరబ్ నేతలకు ఆహ్వానం.. రాజు హమద్
- క్రౌన్ ప్రిన్స్ తో రీజనల్ ఎమిర్ల భేటీ
- చోరీలకు పాల్పడుతున్న ప్రవాసులు అరెస్ట్
- డ్రగ్స్ కేసులో భారతీయ డీజేకి 25 ఏళ్ల జైలుశిక్ష..తీర్పుపై అప్పీల్
- సౌత్ ఆఫ్రికా: లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి
- లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ