యూఎఈ ఎంఓఎస్‌-ఫుడ్‌ సెక్యూరిటీ మరియమ్ అల్‌ మెహ్‌రిని కలిసిన కేంద్ర మంత్రి హరిసిమ్రత్‌ కౌర్‌

- February 18, 2020 , by Maagulf
యూఎఈ ఎంఓఎస్‌-ఫుడ్‌ సెక్యూరిటీ మరియమ్ అల్‌ మెహ్‌రిని కలిసిన కేంద్ర మంత్రి హరిసిమ్రత్‌ కౌర్‌

దుబాయ్:ఓఎఫ్‌పిఐ హరి సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌, యూఏఈ ఎంఓఎస్‌ ఫర్‌ ఫుడ్‌ సెక్యూరిటీ మరియమ్ అల్‌ మెహ్‌రిని కలిశారు. ఫుడ్‌ సెక్యూరిటీ విభాగంలో ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాల్ని ఈ సందర్భంగా ఇరువురు నేతలు కొనియాడారు. ఈ సంబంధాలు మరింత బలోపేతం దిశగా ఇరువురి మధ్యా చర్చలు జరిగాయి. యూఏఈకి అతి పెద్ద ఫుడ్‌ ఎక్‌సపోర్టర్‌గా ఇండియా వుంది. ఫుడ్‌ సెక్టార్‌ రంగంలో యూఏఈ మరింతగా పెట్టుబడులు పెట్టాలని ఈ సందర్భంగా హరి సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ కోరారు. అలాగే యూఏఈలో ఆయా రంగాల్లో పెట్టుబడుల దిశగా భారత్‌కు ప్రతిపాదనలు వచ్చాయి. కాగా, పోనిక్స్‌ గ్రూప్‌, హకాన్‌ అగ్రో, ఇండో అరబ్‌ స్పైసెస్‌ తదితర సంస్థలతో హరి సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. లులు గ్రూప్‌తోనూ, ఇఫ్‌కో, అల్‌ మాయా, ఎమార్‌, షరాఫ్‌ గ్రూప్‌ అల్‌ గురైర్‌ గ్రూప్‌తోనూ చర్చలు జరిగాయి. ఇండియా పెవిలియన్‌ని గల్ఫ్ ఫుడ్‌ 2020లో ఆమె ఈ సందర్భంగా ప్రారంభించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com