దోహా: ఫిబ్రవరి 21 నుంచి పెరగనున్న మెట్రో టికెట్ల రేట్లు

- February 20, 2020 , by Maagulf
దోహా: ఫిబ్రవరి 21 నుంచి పెరగనున్న మెట్రో టికెట్ల రేట్లు

దోహా మెట్రో టికెట్ల రేట్లు పెరగనున్నాయి. ఇప్పటివరకు 2QR ఉన్న టికెట్ ధర 3QR కానుంది. అలాగే 6QRగా ఉన్న రోజు వారి పాస్ ధర 10QR కు పెరగనుంది. సింగిల్ జర్నీగోల్డ్ క్లాస్ టికెట్ రేటు 10QR నుంచి 15QR కానుంది. 30QRగా ఉన్న గోల్డ్ క్లాస్ ఒక రోజు పాస్ రేటు ఇక నుంచి 45QRకు పెరగనుంది. ఈ పెరిగిన ధరలు శుక్రవారం(ఫిబ్రవరి 21) నుంచి అమలులోకి రానున్నాయి. పర్యావరణ పరిక్షణ కోసం పేపర్ టికెట్ల వాడకాన్ని తగ్గించాలనే లక్ష్యంతో దోహా మెట్రో అధికారులు ధరల పెంపు నిర్ణయాన్ని తీసుకున్నారు. అయితే..గోల్డ్ కప్ ట్రావెల్ కార్డు ధరల్లో మాత్రం ఎలాంటి పెంపు ఉండదని దోహా మెట్రో క్లారిటీ ఇచ్చింది. ఇఫ్పటివరకు ఉన్నట్లుగానే 2QR, రోజువారి పాస్ ధర 10QRగానే ఉంటాయి. ట్రావెల్ కార్డు కావాలనుకునే వారు దోహా మెట్రో స్టేషన్స్ లో తీసుకోవచ్చు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com