ఏజెంట్ మోసానికి గురైన తెలంగాణ వాసి..ఆదుకున్న గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి (GWPC)

- February 22, 2020 , by Maagulf
ఏజెంట్ మోసానికి గురైన తెలంగాణ వాసి..ఆదుకున్న గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి (GWPC)

 

 

 

 

దుబాయ్, తెలంగాణ: నిర్మల్ జిల్లాలోని నాగాపూర్ తాండ గ్రామానికి చెందిన అంబాజీ రాథోడ్ అనే కార్మికునికి ఏజెంట్ మాయమాటలు చెప్పి జీతం బాగుంటుందని ఆశ చూపి 21/10/2019 రోజున దుబాయ్ పంపించడం జరిగింది. ఆ కార్మికుడు దుబాయి వచ్చి మూడున్నర నెలలు పని చేసినా చిల్లి గవ్వ కూడ కంపెనీ చెల్లించకపోవడంతో మోసపోయానని విషయం తెలుసుకొని ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో మా గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి (GWPC) ని ఆశ్రయించడంతో మా గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి (GWPC) అధ్యక్షుడు గుండేల్లి నర్సింహా ఆ కార్మికుని దగ్గరికి వెళ్లి అతని సమస్య తెలుసుకొని ఇండియన్ కౌన్సిల్ లేట్ వారికి విషయాన్ని తెలియజేసి వారి పూర్తి సహకారంతో ఆ కార్మికున్ని నిన్న రాత్రి ఇండియా పంపించడం జరిగింది. ఇండియాలో ఎయిర్పోర్టు నుండి అతని స్వగ్రామానికి వెళ్ళటానికి రవాణ సౌకర్యాల నిమిత్తం NRI డిపార్టుమేంటు ద్వార హైదరాబాద్ ఎయిర్పోర్టు లో వెయ్యి రూపాయలు కూడ ఇప్పించడం జరిగింది. ఈ విధంగా గల్ఫ్ ఏజెంట్ లు చేస్తున్న మోసాలకు కార్మికులు బలి కావద్దని, ఏజెంట్లు కూడా గల్ఫ్ కార్మికుల జీవితాలతో ఆడుకోవద్దని, తమ మోసాలను ఇకనైన ఆపాలని మా గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి (GWPC) అధ్యక్షులు గుండేల్లి నర్సింహా మరియు ఉపాధ్యక్షులు శేఖర్ గౌడ్ హెచ్చరించారు. వారు ఆ మోసాలను ఆపని ఎడల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మోసాలు చేస్తున్న ఏజెంట్లను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి (GWPC) అధ్యక్షులు గుండేల్లి నర్సింహా ఉపాధ్యక్షులు శేఖర్ గౌడ్, దొనకంటి శ్రీనివాస్, కనకట్ల రవీందర్,షేక్ వల్లి, మునిందర్, అశోక్ రెడ్డి, కట్ట రాజు, రాయిల్ల మల్లేశం, శరత్ గౌడ్, రఘు, ప్రవీణ్ చేర్యాల, నరేందర్ గౌడ్, సాన లక్ష్మణ్, మామిడిపల్లి వెంకటేశం, చింతల లక్ష్మణ్, పేనుకుల అశోక్, చిరుత నరేష్, గోవర్ధన్ యాదవ్, మనెళ్లి ప్రసాద్, కాసారపు భుమేష్, యువరాజు, జలపతి, అజయ్, హరిశ్, సాయి మరియు సభ్యులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com