భారత్‌లో డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోరోజు షెడ్యూల్‌ ఇదే

- February 24, 2020 , by Maagulf
భారత్‌లో డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోరోజు షెడ్యూల్‌ ఇదే

న్యూఢిల్లీ: భారత్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రెండో రోజు షెడ్యూల్ వివరాలు ప్రకటించారు. మంగళవారం ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో ట్రంప్‌కు స్వాగత కార్యక్రమం ఉంటుంది. 10.30కి రాజ్‌ఘాట్‌లో జాతిపితకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రధాని మోదీ నివాళులర్పించనున్నారు. 11 గంటలకు హైదరాబాద్‌ హౌస్‌లో మోదీతో ట్రంప్‌ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. మధ్యాహ్నం 12.40గంటలకు ద్వైపాక్షిక ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు. ఆ తర్వాత మోదీ-ట్రంప్‌ అధికారిక మీడియా సమావేశం నిర్వహిస్తారు. రాత్రి 7.30కి రాష్ట్రపతి భవన్‌లో ట్రంప్‌కు విందు ఇవ్వనున్నారు. అనంతరం అమెరికా రాయబార సిబ్బందితో ట్రంప్‌ భేటీకానున్నారు. రాత్రి 10గంటలకు ట్రంప్‌ బృందం అమెరికాకు తిరుగుపయనం అవుతుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com