ఖతార్,అల్జీరియా మధ్య ద్వైపాక్షిక,వాణిజ్య ఒప్పందాలపై చర్చ
- February 26, 2020
అల్జీర్స్:అల్జీరియా పర్యటనలో ఉన్న ఖతార్ ఆమీర్ హెచ్ హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ కు ఆ దేశ ప్రభుత్వం సాదర స్వాగతం పలికింది. హౌరి బౌమీడిన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఆమీర్ సైనిక గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం అల్జీరియా ప్రెసిడెంట్ హెచ్ ఇ అబ్దేల్మద్జిద్ టెబ్బౌన్ తో అల్జీర్స్లోని ఎల్ మౌరాడియా ప్రెసిడెన్షియల్ ప్యాలెస్లో జరిగిన అధికారిక సమావేశంలో ఆమీర్ పాల్గొన్నారు. ఖతార్, అల్జీరియా మధ్య ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదలతో పాటు అర్ధిక రంగంలోని పలు కీలక అంశాలపై చర్చించారు. ఎనర్జీ, ఎకనామీ, పెట్టుబడులతో పాటు స్పోర్ట్స్, కల్చర్ రంగాల్లో పరస్పర సహకారం ఇచ్చిపుచ్చుకుంటూ డెవలప్మెంట్ సాధించే అంశాలపై డిస్కస్ చేశారు. అలాగే పాలస్తీనా, లిబియా సంక్షోభం వంటి అంతర్జాతీయ పరిణామాలపై కూడా ఇరువురు దేశాధినేతలు డిస్కస్ చేశారు. ఈ సందర్భంగా ఆమీర్ మాట్లాడుతూ..అరబ్ సమాజానికి అల్జీరియా చేస్తున్న సాయాన్ని మరువలేమని ప్రశంసించారు. అల్జీరియాలో త్వరలో జరగబోయే అరబ్ సమ్మిట్ సక్సెస్ కావాలని ఆయన అకాంక్ష వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







