దోహా: ఇరాన్ నుంచి దోహ చేరుకున్న ఖతారీ పౌరులు
- February 28, 2020
మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో కరోనా వైరస్ అత్యధికంగా వ్యాప్తి చెందుతున్న దేశం ఇరాన్. ఇరాన్ నుంచి గల్ఫ్ కంట్రీస్ కు ట్రావెల్ చేస్తున్న వారిలో ఎక్కువగా కోవిడ్ -19 బారిన పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరాన్ లో ఉన్న తమ పౌరులను ఖతార్ ప్రభుత్వం వెనక్కి రప్పించింది. వైరస్ వ్యాప్తి చెందకుండా వారిని దోహాలోని ఓ హోటల్ లో నిర్బంధించింది. తుదుపరి వైద్య పరీక్షలు ముగిసే వరకు వారికి అవసరమైన వసతులను హోటల్ లోనే సమకూర్చింది ప్రభుత్వం. దాదాపు రెండు వారాల పాటు వారు హోటల్ లోనే ఉండేలా చర్యలు చేపట్టింది. ప్రస్తుతానికి ఖాతార్ లో ఒక్క కరోనా వైరస్ కూడా నమోదు కాలేదని అధికారులు వెల్లడించారు. అయితే..ఎవరూ కరోనా వైరస్ వ్యాప్తిపై అనధికారిక సమాచారాన్ని స్ప్రెడ్ చేయవద్దని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







