దోహా: ఇరాన్ నుంచి దోహ చేరుకున్న ఖతారీ పౌరులు

- February 28, 2020 , by Maagulf
దోహా: ఇరాన్ నుంచి దోహ చేరుకున్న ఖతారీ పౌరులు

మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో కరోనా వైరస్ అత్యధికంగా వ్యాప్తి చెందుతున్న దేశం ఇరాన్. ఇరాన్ నుంచి గల్ఫ్ కంట్రీస్ కు ట్రావెల్ చేస్తున్న వారిలో ఎక్కువగా కోవిడ్ -19 బారిన పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరాన్ లో ఉన్న తమ పౌరులను ఖతార్ ప్రభుత్వం వెనక్కి రప్పించింది. వైరస్ వ్యాప్తి చెందకుండా వారిని దోహాలోని ఓ హోటల్ లో నిర్బంధించింది. తుదుపరి వైద్య పరీక్షలు ముగిసే వరకు వారికి అవసరమైన వసతులను హోటల్ లోనే సమకూర్చింది ప్రభుత్వం. దాదాపు రెండు వారాల పాటు వారు హోటల్ లోనే ఉండేలా చర్యలు చేపట్టింది. ప్రస్తుతానికి ఖాతార్ లో ఒక్క కరోనా వైరస్ కూడా నమోదు కాలేదని అధికారులు వెల్లడించారు. అయితే..ఎవరూ కరోనా వైరస్ వ్యాప్తిపై అనధికారిక సమాచారాన్ని స్ప్రెడ్ చేయవద్దని అధికారులు సూచించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com