మక్కా: భక్తులకు అంటు వ్యాధులు సోకకుండా ప్రార్ధన మందిరాల్లో కట్టుదిట్టమైన చర్యలు
- February 28, 2020
ప్రార్ధన చేసేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి అంటు వ్యాధులు ప్రబలకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. మక్కాలోని రెండు మసీదులను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నామని వివరించారు. వివిధ దేశాల నుంచి వచ్చే భక్తులకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందించేలా ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. మీడియా ద్వారా అన్ని లాంగ్వేజస్ లో ప్రజలకు అవసరమైన సమాచారం అందించటంతో పాటు స్థానికంగా లేటెస్ట్ మెడికల్ ఇన్సస్ట్రక్షన్స్, ఎమర్జెన్సీ డెవలప్మెంట్స్ తెలిపేలా స్క్రీన్లు ఏర్పాటు చేస్తామని అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈ మేరకు తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు వివరించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో భక్తులకు అవసరమైన సేవలు అందిస్తామని, భక్తులకు అవసరమైన మాస్క్స్, హ్యండ్ సానిటైజర్ అందిస్తామని వెల్లడించారు. ప్రతీ ఏడాది దాదాపు 7 మిలియన్ మంది భక్తులు కింగ్ డమ్ విజిట్ చేస్తారని వాళ్లంతా జెడ్డా, మదీనా ఎయిర్ పోర్ట్ ద్వారా వస్తారు. అయితే..వైరస్ వ్యాప్తిని నివారించేందుకు అన్ని ముందస్తు జాగ్రత్తలు చేపట్టిన సౌదీ ప్రభుత్వం కరోనా ఎఫెక్టెడ్ కంట్రీస్ లోని దాదాపు డజన్ దేశాల నుంచి వచ్చే వారిపై ఆంక్షలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







