కరోనా అలర్ట్‌: షిప్స్‌లో ఇన్‌స్పెక్షన్స్‌ కోసం మెడికల్‌ టీమ్స్

- February 29, 2020 , by Maagulf
కరోనా అలర్ట్‌: షిప్స్‌లో ఇన్‌స్పెక్షన్స్‌ కోసం మెడికల్‌ టీమ్స్

కువైట్‌: కువైట్‌ పోర్ట్స్‌ అథారిటీ, దేశంలోకి వచ్చే షిప్‌లను తనిఖీ చేసేందుకోసం మెడికల్‌ టీమ్స్ ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. సిబ్బందికీ, అలాగే ప్రయానించేవారికి ఈ వైద్య బృందాలు కరోనా వైరస్‌ పరీక్షలు నిర్వహిస్తాయి. అథారిటీ అధికార ప్రతినితి నాజర్‌ అల్‌ షులైమి మాట్లాడుతూ, మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌ మార్గదర్శకాల మేరకు మెడికల్‌ టీమ్స్ విధులు నిర్వహిస్తాయని తెలిపారు. అనుమానితుల్ని క్వారెంటైన్‌ చేసేందుకు తగిన ఏర్పాట్లు చేస్టున్నట్లు చెప్పారు. రౌండ్‌ ది క్లాక్‌ ఈ సేవలు కొనసాగుతాయి. ప్రపంచాన్ని కరోనా వైరస్‌ వణికిస్తున్న నేపథ్యంలో కువైట్‌, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com