పెన్షన్ పధకం..జగన్ సంచలన నిర్ణయం
- March 01, 2020
జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత చాలా స్పీడ్ గా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా సంక్షేమ పధకాల విషయంలో తీసుకునే నిర్ణయాలు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో పెన్షన్ కోసమే అధికంగా నిధులు కేటాయిస్తోంది. ప్రతినెలా ఈ పెన్షన్ కోసం రూ. 1320 కోట్ల రూపాయలు కేటాయిస్తోంది. జనవరి వరకు 55 లక్షల మంది రాష్ట్రంలో పెన్షన్ అందుకుంటుండగా, ఈ నెల నుంచి మరో 5 లక్షలమందికి లబ్ది చేకూరబోతున్నది.
మొత్తంగా 60 లక్షల మందికి పెన్షన్ అందిస్తున్నారు. మరో ఐదు లక్షల మందికి కొత్తగా పెన్షన్ ఇవ్వబోతుండటంతో అదనంగా ప్రభుత్వంపై రూ. 200 కోట్ల రూపాయల భారం పడింది. అయితే, ఈ ఏడాది ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో 10శాతం నిధులను పెన్షన్ పథకం కోసం కేటాయించబోతున్నట్టు తెలుస్తోంది. ఇది సంచలన నిర్ణయం అని చెప్పాలి.
తాజా వార్తలు
- చక్కెర వినియోగంపై చిన్నారులకు GTA అవగాహన..!!
- పసికందు మృతి కేసు.. తల్లిదండ్రులకు మూడేళ్ల జైలుశిక్ష ఖరారు..!!
- ఒమాన్లో అడ్వెంచర్ టూరిస్టులకు హెచ్చరిక..!!
- దుబాయ్లో ట్రాఫిక్కు చెక్.. 4 కీలక జంక్షన్లలో కొత్త బ్రిడ్జిలు, టన్నెల్స్..!!
- కార్మికుల రక్షణకు కువైట్ కీలక చర్యలు..!!
- కేరళలో నిరుపేదలకు.. బహ్రెయిన్ ప్రవాస పారిశ్రామికవేత్త సేవలకు ప్రశంసలు..!!
- రూ.10, రూ.20 ప్లాస్టిక్ నోట్ల ట్రయల్స్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- ఏపీ ప్రజలకు విశాఖ AIG గుడ్ న్యూస్
- విద్యార్థులపై అరాచకాలకు పాల్పడిన వారి పై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం: CJI
- శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్







