కువైట్:మాస్క్స్ డిమాండ్ రీచ్ అయ్యేలా ఎమర్జెన్సీ టీం ఏర్పాటు
- March 02, 2020
కువైట్:కరోనా వైరస్ ను అరికట్టేందుకు కువైట్ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోంది. ఆస్పత్రిలో ప్రత్యేకంగా ఐసోలేటెడ్ వార్డ్స్ ఏర్పాట్ చేస్తూనే వైరస్ ఇతరులకు వ్యాప్తి చెందకుండా మెడికల్ సప్లైస్ పై ఫోకస్ చేస్తోంది. ఇందులో భాగంగా ప్రజలకు అవసరమైన మాస్క్స్, సానిటైజర్స్ కొరత ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందుకోసం ఒక ఎమర్జెన్సీ టీంను ఏర్పాటు చేసింది. డిమాండ్ కు తగినంత మాస్క్స్, సానిటైజర్స్ సప్లై చేసేలా ఫ్యాక్టరీలతో కోఆర్డినేట్ చేయటమే ఈ ఎమర్జెన్సీ టీం లక్ష్యం. కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో అత్యవసరంగా సమావేశమైన మినిస్ట్రి ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రి ఈ నిర్ణయం తీసుకుంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







