ఒమన్:ఫోన్ కోసం సూసైడ్ చేసుకున్న 14 ఏళ్ల బాలుడు
- March 04, 2020
ఒమన్ లో 14 ఏళ్ల బాలుడు మోటర్ బైక్ టైర్ ట్యూబ్ తో ఉరి వేసుకొని చనిపోయాడు. మంగళవారం రాత్రి ఏడు గంటల ప్రాంతంలో తన రూంలోనే ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. ఫోన్ విషయంలో తన తండ్రి మందలించటం వల్లే అతను ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. రాయల్ ఒమన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాధితుడు అల్ ధహిరా గవర్నరేట్లోని విలాయత్ ఇబ్రి నివాసి. లంచ్ టైంలో ఫోన్ విషయంలో తన తండ్రితో అతనికి వాదన జరిగింది. దీంతో మనస్థాపానికి గురైతన అతను రూంలోకి వెళ్లి విపరీత చర్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ టీం ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఈ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త







