యూఏఈలో మరో ఆరుగురికి సోకిన కరోనా వైరస్
- March 04, 2020
యూఏఈలో కొత్తగా మరో ఆరుగురికి కరోనా వైరస్ సోకింది. కోవిడ్-19 బారిన పడిన వాళ్లందరికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్టాండర్డ్స్ మేరకు చికిత్స అందిస్తున్నట్లు మినిస్ట్రి ఆఫ్ హెల్త్ అండ్ ప్రివెన్షన్ అధికారులు ప్రకటించారు. కొత్తగా వైరస్ సోకిన ఆరుగురిలో ఇద్దరు రష్యన్లు, ఇద్దరు ఇటాలియన్స్ ఉన్నారు. మిగిలిన ఇద్దరిలో ఒకరు జర్మన్, మరొకరు కొలంబియన్. సైక్లింగ్ ఈవెంట్ కు వచ్చిన ఇద్దరు కరోనా పేషెంట్లతో వీళ్లంతా క్లోజ్ గా మూవ్ అయ్యారని, ఆ ఇద్దరి నుంచి ఈ ఆరుగురికి వైరస్ విస్తరించిందని తెలిపారు. ప్రస్తుతం వారి హెల్త్ కండీషన్ స్టేబుల్ గానే ఉంది. సైక్లింగ్ టూర్ కు వచ్చిన అథ్లెట్లకు వైరస్ వ్యాపించే అవకాశాలు ఉండటంతో వారు బస చేసిన రెండు హోటళ్లను నిర్బంధించారు. అందులోని అథ్లెట్స్, అడ్మినిస్ట్రేటీవ్ స్టాఫ్ ఇతరులతో కాంటాక్ట్ కాకుండా జాగ్రత్త చర్యలు చేపట్టారు. అలాగే అథ్లెట్స్ కు కోవిడ్-19 టెస్టులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికి ఎవరికి పాజిటీవ్ అని నిర్ధారణ కాలేదు. అయినా..ముందు జాగ్రత్తగా రీ చెకప్ కూడా చేస్తున్నారు. అలాగే హటల్ బిల్డింగ్స్, వెహికిల్స్, పరిసర ప్రాంతాల్లో స్టెరిలైసేషన్ ప్రొసీజర్ చేపట్టారు.
--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







