వైమానికదళ విమానంలో ఇరాన్ నుంచి 58 మంది ఇండియాకు
- March 10, 2020
కరోనా వైరస్ పేరు చెబితేనే జనం బెంబేలెత్తిపోతున్నారు. చైనా తర్వాత ఇరాన్లోనే వైరస్ బారినపడి చనిపోయారు. అయితే అక్కడికి వెళ్లిన భారతీయ పర్యాటకులను స్వదేశం తీసుకొచ్చారు. అక్కడి భారత రాయబార అధికారులతో సంప్రదింపులు జరిపి, భారత వైమానిక దళ విమానంలో ఇండియా తీసుకొచ్చారు.
పర్యటన కోసం ఇరాన్ వెళ్లిన వారిని తీసుకొచ్చేందుకు ఆదివారమే వైమానికి దళానికి చెందిన సీ-17 విమానం వెళ్లింది. కానీ అక్కడి ప్రక్రియ పూర్తి చేయడానికి సమయం పట్టింది. ఇరాన్లో భారతీయ రాయబార కార్యాలయ అధికారులు.. అక్కడి ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు. భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 2 గంటలకు టెహ్రాన్ విమానాశ్రయం నుంచి ప్రయాణికులతో పాటు ప్లైట్ బయల్దేరింది. మంగళవారం ఉదయం 9.30 గంటలకు ఘజియాబాద్లోని హిందాన్ ఎయిర్పోర్టులో విమానం ల్యాండయ్యింది.
ప్లైట్ దిగిన వెంటనే వారిని 14 రోజులపాటు ఐసోలేషన్ వార్డులో ఉంచుతారు. అన్నీ వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాతే.. తమ స్వస్ధలాలకు పంపిస్తారు. ఇరాన్లో చిక్కుకున్న భారతీయ పర్యాటకులను స్వదేశం తీసుకొచ్చేందుకు సాయం చేసిన భారత రాయబార కార్యాలయ అధికారులకు విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ ధన్యవాదాలు తెలిపారు. మెడికల్ టీం, ఇండియన్ ఎయిర్ఫోర్స్ బృందానికి కూడా థాంక్స్ చెప్పారు.
EAM S Jaishankar: Thanks to the efforts of our Embassy in Iran and Indian medical team there, operating under challenging conditions. Thank you Indian Air Force. We appreciate cooperation of Iranian authorities. We are working on the return of other Indians stranded there. https://t.co/fXp4grbibC
— ANI (@ANI) March 10, 2020
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







