కువైట్: కరోనా ఎఫెక్ట్ తో స్కూల్స్, థియేటర్స్, హోటల్స్ బంద్..వీసా జారీ నిలిపివేత
- March 10, 2020
కరోనా వైరస్ ను నివారించేందుకు కువైట్ ప్రభుత్వం మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అన్ని రకాల విసాల జారీని నిలిపివేసింది. ఈ మేరకు కేబినెట్ నుంచి మినిస్ట్రి ఆఫ్ ఇంటిరియర్ కు స్పష్టమైన సూచనలు అందాయి. మళ్లీ అదేశాలు వచ్చే వరకు ఎలాంటి వీసాలు జారీ చేయవద్దని తేల్చి చెప్పింది. అయితే..డిప్లామాటిక్ వీసాలను మాత్రం కొనసాగించనున్నారు. అలాగే జనం గుమికూడా ప్రాంతాల విషయంలోనూ కఠిన నిర్ణయాలు తీసుకుంది. స్కూళ్లకు మార్చి 26 వరకు సెలవులు పొడగించారు. సినిమా థియేటర్లు మూసివేశారు. అలాగే హోటల్స్, బాల్ రూమ్స్, వెడ్డింగ్ హాల్స్ ను కూడా మూసివేయాల్సిందిగా ఆదేశించారు. దేశంలో అన్ని రకాల స్పోర్ట్స్ ఈవెంట్స్ ని రద్దు చేశారు. మళ్లీ ఆదేశాలు వచ్చే వరకు ప్రస్తుత నిషేధ ఆదేశాలు అమల్లో ఉండనున్నాయి.
తాజా వార్తలు
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!







