రాజధానిలో జోన్లను మారుస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్
- March 10, 2020
అమరావతి : రాజధానిలో జోన్లను మారుస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాజధానిలో వివిధ అవసరాలకు కేటాయించిన భూములను ఇళ్ల స్థలాల పట్టాల కోసం జోన్లను మార్చారు. 967 ఎకరాల 25 సెంట్లు భూమిని ఇళ్ల స్థలాల కోసం కేటాయించారు. తుళ్లూరు, మంగళగిరి మండలాల్లోని వివిధ గ్రామాల్లోని భూములను 6 జోన్లుగా విభజిస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు. కృష్ణాయపాలెం గ్రామంలో రిజర్వ్ జోన్, రీజనల్ సెంటర్ జోన్, వెంకటాయపాలెంలో రీజనల్ సెంటర్, నిడమర్రులో నాన్ పొల్యూటింగ్ జోన్, నాన్ పొల్యూటింగ్ ఇండస్ట్రీ జోన్, కురకల్లులో టౌన్ సెంటర్ జోన్, ఎడ్యుకేషన్ జోన్, మందడంలో బిజినెస్ పార్క్ జోన్, టౌన్ సెంటర్ జోన్, నైబర్ హుడ్ సెంటర్ జోన్, ఎడ్యుకేషన్ జోన్, ఐనవోలు బిజినెస్ పార్క్ జోన్, ఎడ్యుకేషన్ జోన్లుగా నోటిఫికేషన్ విడుదల చేశారు.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







