ఇరాన్: కరోనా భయంతో 70,000 మంది ఖైదీల విడుదల

- March 10, 2020 , by Maagulf
ఇరాన్: కరోనా భయంతో 70,000 మంది ఖైదీల విడుదల

ప్రపంచ దేశాల్లో చైనా తర్వాత కరోనాతో వణికిపోతున్న రెండో దేశం ఇరాన్. గత ఇరవై నాలుగు గంటల్లోనే ఇక్కడ 43 మంది చనిపోతే..595 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ దీంతో వైరస్ ను ఎదుర్కొనే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఏకంగా 70 వేల మంది ఖైదీలను జైలు నుంచి విడుదల చేయాలని నిర్ణయించింది. కరుడు గట్టిన ఖైదీలను మినహా మిగిలిన వారిని రిలీజ్ చేయనున్నారు. అయితే..విడుదలైన ఖైదీలు మళ్లీ జైలుకు ఎప్పుడు రిటర్న్ కావాలో మాత్రం ఇరానియన్ జ్యూడిషియరీ అధికారులు తెలుపలేదు. ఇప్పటివరకు ఇరాన్ లో 7,161 మందికి కరోనా బారిన పడగా..237 మంది చనిపోయిన విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com