క్రికెట్ అభిమానులకు షాక్.. ఐపీఎల్ వద్దని కోర్టులో పిటిషన్..!
- March 11, 2020
చైనాలో మొదలైన కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచదేశాలు వణికిపోతున్న సంగతి తెలిసిందే. ఇక ఇండియాను కూడా ఇప్పుడు కరోనా బెంబేలెత్తిస్తుంది. తాజాగా ఇండియా వ్యాప్తంగా 60 కేసులు నమోదయ్యాయి. దీని ప్రభావం అన్ని రంగాలపై పడుతుంది. ఇక మార్చి 29 నుండి ప్రారంభం కావలసిన ఐపీఎల్ 13వ సీజన్ జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ఐపీఎల్ ను నిర్వహించడానికి బీసీసీఐకి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వవద్దని కోరుతూ మద్రాస్ హైకోర్టులో న్యాయవాది జి అలెక్స్ బెంజిగర్ పిటిషన్ వేశారు. దీనిపై జస్టిస్ ఎంఎం సుందరేష్, కృష్ణన్ రామస్వామి డివిజన్ బెంచ్ గురువారం విచారం చేపట్టనుంది. ప్రపంచ ఆరోగ్యసంస్థ వెబ్సైటు లో కోవిడ్-19 మందును ఇంకా కనుగొన్నట్లు నమోదు కాలేదని పిటిషన్ లో అలెక్స్ తెలిపారు. ఇక మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కూడా ఐపీఎల్ ను వాయిదా వేయాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు