దోహా: ఆన్ లైన్ లో బిర్లా పబ్లిక్ స్కూల్ క్లాసెస్..కరోనాతో కొత్త డిసిషన్
- March 11, 2020
కరోనా ఎఫెక్ట్ తో స్కూల్స్ మూసివేయాలన్న ఖతార్ ప్రభుత్వ ఆదేశాల మేరకు దోహాలోని పబ్లిక్ స్కూల్ కూడా తమ స్టూడెంట్స్ కి సెలవులు ప్రకటించింది. అయితే..తమ స్టూడెంట్స్ కి ఆన్ లైన్ ఫ్లాట్ ఫాం (వర్చువల్ క్లాసెస్) ద్వారా క్లాసెస్ స్టార్ట్ చేయాలని బిర్లా స్కూల్ యాజమాన్యం నిర్ణయించింది. గ్రేడ్ 12 స్టూడెంట్స్ కి (అకాడమిక్ ఇయర్ 2020-21) కి మార్చి 15 నుంచి వర్చువల్ క్లాసెస్ స్టార్ట్ చేయనున్నారు. అలాగే టెన్త్ గ్రేడ్ స్టూడెంట్స్ కి మార్చి 22 నుంచి, సిక్స్త్ నుంచి నైన్త్ వరకు స్టూడెంట్స్ కి వచ్చే నెల 5 నుంచి వర్చువల్ క్లాసెస్ ప్రారంభం అవుతాయి. ఇక ఫిఫ్త్ గ్రేడ్ స్టూడెంట్స్ వరకు మాత్రం వర్చువల్ క్లాసెస్ చేపట్టడం లేదు. మినిస్ట్రి ఆఫ్ ఎడ్యూకేషన్ నుంచి తదుపరి ఆదేశాలు వచ్చాక వారికి క్లాసెస్ ప్రారంభించనున్నారు. అయితే..గ్రేడ్ టెన్త్, టువెల్త్ స్టూడెంట్స్ కి CBSE బోర్డ్ ఎగ్జామ్స్ షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని స్కూల్ నిర్వాహకులు తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా స్కూల్ నుంచి ఎలాంటి ట్రాన్స్ పోర్టేషన్ ఉండదని, పేరెంట్స్ తమ పిల్లల్ని ఎగ్జామ్ సెంటర్ దగ్గర డ్రాప్ అండ్ పికప్ చేసుకోవాలని సూచించారు. ఇక కేజీ నుంచి ఎయిత్ వరకు స్టూడెంట్స్ కి మాత్రం ఎగ్జామ్స్ రద్దు చేశారు. ఇప్పటి వరకు నిర్వహించిన ఎగ్జామ్స్ లో వచ్చిన మార్కులను బట్టి వచ్చే యావరేజ్ మార్కులనే అకాడమిక్ మార్కులుగా కన్పిడర్ చేయనున్నారు.
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్కు విశేష స్పందన.. తొలి ప్రయాణానికి ముందే 10 వేలకు పైగా టికెట్ల విక్రయం
- హిమాచల్ ప్రదేశ్ వరదలు..చిక్కుకుపోయిన 50 పర్యాటక వాహనాలు
- గ్రీస్లో UPIని ప్రారంభించిన భారత్
- ఒమాన్–ఫ్రాన్స్ మధ్య 12 కీలక ఒప్పందాలు.. మస్కట్ మెట్రో ప్రాజెక్టుకు ముందడుగు
- అబుదాబి నుంచి తొలి ఎతిహాద్ రైలు బయలుదేరింది
- అధునాతన పీడియాట్రిక్ అలర్జీ డయాగ్నస్టిక్ సేవలను ప్రారంభించిన HMC..!!
- ఆగస్టు 20 నుండి సింగిల్-యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల పై బహ్రెయిన్ నిషేధం..!!
- హోర్ముజ్ జలసంధి పై ఒమన్-ఇరాన్ చర్చలు..!!
- యూఏఈలో స్ట్రాబెర్రీ మూన్ కనిపిస్తుందా?
- ఫహహీల్ ఎక్స్ప్రెస్వే పై అగ్నిప్రమాదం..!!







