అబుధాబి:అకాడమిక్ ఇయర్ ఎండింగ్ వరకు ఈ-లెర్నింగ్ ఎక్స్ టెండ్ చేసే ప్లాన్స్ లేవు
- March 12, 2020
అబుధాబి:కరోనా వైరస్ ఎఫెక్ట్ తో స్కూల్ స్టూడెంట్స్ కి ఈ-లెర్నింగ్ సిస్టం అమలు చేస్తున్నట్లు వస్తున్న రూమర్స్ ను మినిస్ట్రి ఆఫ్ ఎడ్యూకేషన్ కొట్టిపారేసింది. ఇప్పటివరకు అలాంటి ప్లాన్స్ ఏమి లేవని తేల్చి చెప్పింది. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న బేస్ లెస్ వార్తలను పేరెంట్స్ ఎవరూ పట్టించుకోవద్దని కూడా సూచించింది. కరోనా వైరస్ కారణంగా ఈ అకాడమిక్ ఇయర్ ను క్లోజ్ చేసి..స్టూడెంట్స్ కి ఈ-లెర్నింగ్ ద్వారా లెసెన్స్ కంటిన్యూ చేయబోతున్నట్లు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిరాధారమైనవని క్లారిటీ ఇచ్చిన విద్యా మంత్రిత్వ శాఖ క్లారిటీ ఇచ్చింది. అయితే..తమకు విద్యార్ధుల ప్రయోజనాలే అధిక ప్రధాన్యమని వారికి సంబంధించిన అంశాలను అధికారిక వెబ్ సైట్లలోగానీ, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్ లో గానీ ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తామని కూడా స్పష్టం చేసింది. పేరెంట్స్ అధికారిక వెబ్ సైట్లలో అందించిన సమాచారాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని కూడా మినిస్ట్రి ఆఫ్ ఎడ్యూకేషన్ సూచించింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







