కరోనా ఎఫెక్ట్: ట్రావెల్ అడ్వయిజరీ జారీ చేసిన ఇండియాలోని ఒమన్ ఎంబసీ
- March 12, 2020
మస్కట్: ట్రావెల్ వీసాల్ని ఇండియా క్యాన్సిల్ చేస్తున్న నేపథ్యంలో ఢిల్లీలోని ఒమన్ ఎంబసీ, తమ పౌరులకు ట్రావెల్ అడ్వయిజరీ జారీ చేసింది. ఏప్రిల్ 15 వరకు అన్ని టూరిస్ట్ వీసాల్ని ఇండియా క్యాన్సిల్ చేసింది. వైరస్ ప్రభావం వున్న ఏడు దేశాల నుంచి వచ్చే ప్రయాణీకుల్ని క్వారంటీన్ చేస్తున్నట్లు అధికార యంత్రాంగం పేర్కొంది. ఈనేపథ్యంలో ఎంబసీ, తమ పౌరులకు స్పష్టమైన సూచనలు చేసింది. పరిస్థితి అదుపులోకి వచ్చేవరకూ తమ పౌరులు వేచి వుండాలని ఎంబసీ సూచించింది. ఇండియాలో ఇప్పటికే వున్న ఒమన్ పౌరులు, జనసమ్మర్ధం ఎక్కువగా వున్న ప్రాంతాలకు దూరంగా వుండాలని ఎంబసీ ఆదేశించింది. అత్యవసర సందర్భాల్లో ఢిల్లీ లేదా ముంబైలోని ఎంబసీలను సంప్రదించాలని విజ్ఞప్తి చేసింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,మస్కట్)
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







