కరోనా ఎఫెక్ట్: ట్రావెల్ అడ్వయిజరీ జారీ చేసిన ఇండియాలోని ఒమన్ ఎంబసీ
- March 12, 2020
మస్కట్: ట్రావెల్ వీసాల్ని ఇండియా క్యాన్సిల్ చేస్తున్న నేపథ్యంలో ఢిల్లీలోని ఒమన్ ఎంబసీ, తమ పౌరులకు ట్రావెల్ అడ్వయిజరీ జారీ చేసింది. ఏప్రిల్ 15 వరకు అన్ని టూరిస్ట్ వీసాల్ని ఇండియా క్యాన్సిల్ చేసింది. వైరస్ ప్రభావం వున్న ఏడు దేశాల నుంచి వచ్చే ప్రయాణీకుల్ని క్వారంటీన్ చేస్తున్నట్లు అధికార యంత్రాంగం పేర్కొంది. ఈనేపథ్యంలో ఎంబసీ, తమ పౌరులకు స్పష్టమైన సూచనలు చేసింది. పరిస్థితి అదుపులోకి వచ్చేవరకూ తమ పౌరులు వేచి వుండాలని ఎంబసీ సూచించింది. ఇండియాలో ఇప్పటికే వున్న ఒమన్ పౌరులు, జనసమ్మర్ధం ఎక్కువగా వున్న ప్రాంతాలకు దూరంగా వుండాలని ఎంబసీ ఆదేశించింది. అత్యవసర సందర్భాల్లో ఢిల్లీ లేదా ముంబైలోని ఎంబసీలను సంప్రదించాలని విజ్ఞప్తి చేసింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,మస్కట్)
తాజా వార్తలు
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!







