కరోనా:సవాలు విసిరిన మోదీ...
- March 16, 2020_1584380367.jpg)
ఢిల్లీ:భారత దేశవ్యాప్తంగా కరోనా వైరస్ బాధితుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. సోమవారం వరకు భారత దేశ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 114కు చేరుకుంది. ఇద్దరు కరోనా కారణంగా మరణించారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాయి. అయితే ప్రధాని మోదీ కరోనా వైరస్ను అడ్డుకునేందుకు దేశంలోని ప్రతి ఒక్కరూ తమకు తోచిన సలహాలు, సూచనలు, పరిష్కార మార్గాలు తెలియజేయాలని కోరారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు.
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, అయితే చాలా మంది ఈ వైరస్ను నియంత్రించేందుకు సలహాలు, సూచనలు ఇస్తున్నారని, కానీ వారు https://innovate.mygov.in/covid19/ అనే వెబ్సైట్లోకి వెళ్లి తమ సలహాలు, సూచనలు, పరిష్కార మార్గాలను తెలియజేయవచ్చని అన్నారు. కాగా ఈ సైట్లో ఔత్సాహికులు, స్టార్టప్ కంపెనీలు లేదా పరిశ్రమలు ఎవరైనా సరే.. తమ సలహాలు, సూచనలు, కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కావల్సిన పరిష్కార మార్గాలతోపాటు అందుకు అవసరమైన సమాచారాన్ని పీడీఎఫ్ డాక్యుమెంట్ రూపంలో అప్లోడ్ చేయవచ్చు. లేదా యూట్యూబ్ వీడియోలో వివరణ ఇచ్చి ఆ వీడియో లింక్ను ఆ సైట్లో పోస్ట్ చేయవచ్చు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?