కరోనా:సవాలు విసిరిన మోదీ...
- March 16, 2020
ఢిల్లీ:భారత దేశవ్యాప్తంగా కరోనా వైరస్ బాధితుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. సోమవారం వరకు భారత దేశ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 114కు చేరుకుంది. ఇద్దరు కరోనా కారణంగా మరణించారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాయి. అయితే ప్రధాని మోదీ కరోనా వైరస్ను అడ్డుకునేందుకు దేశంలోని ప్రతి ఒక్కరూ తమకు తోచిన సలహాలు, సూచనలు, పరిష్కార మార్గాలు తెలియజేయాలని కోరారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు.
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, అయితే చాలా మంది ఈ వైరస్ను నియంత్రించేందుకు సలహాలు, సూచనలు ఇస్తున్నారని, కానీ వారు https://innovate.mygov.in/covid19/ అనే వెబ్సైట్లోకి వెళ్లి తమ సలహాలు, సూచనలు, పరిష్కార మార్గాలను తెలియజేయవచ్చని అన్నారు. కాగా ఈ సైట్లో ఔత్సాహికులు, స్టార్టప్ కంపెనీలు లేదా పరిశ్రమలు ఎవరైనా సరే.. తమ సలహాలు, సూచనలు, కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కావల్సిన పరిష్కార మార్గాలతోపాటు అందుకు అవసరమైన సమాచారాన్ని పీడీఎఫ్ డాక్యుమెంట్ రూపంలో అప్లోడ్ చేయవచ్చు. లేదా యూట్యూబ్ వీడియోలో వివరణ ఇచ్చి ఆ వీడియో లింక్ను ఆ సైట్లో పోస్ట్ చేయవచ్చు.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







