కరోనాపై పోరాటంలో ఖతార్...48 గంటల్లో అల్ మీరా మార్కెట్ ఏర్పాటు
- March 17, 2020దోహా:కరోనాపై పోరాటంలో భాగంగా గత కొద్ది రోజులుగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్న ఖతార్..ప్రజలకు నిత్యావసర సరుకులు అందించటంలోనూ అంతే వేగంగా అలర్ట్నేట్
యాక్షన్స్ తీసుకుంటుంది. వైరస్ భయంతో షాపులు కూడా మూత పడుతుండటంతో ముకైనిస్ ప్రాంతంలో అల్ మీరా కొత్త తాత్కాలిక శాఖను ప్రారంభించింది. అల్ మీరా
కన్సూమర్ గూడ్స్ కేవలం 48 గంటల్లోనే స్టోర్ ను ప్రారంభించటం విశేషం. ఈ స్టోర్ ద్వారా స్థానికులకు పరిశుభ్ర పరిచిన సరుకులు, శుభ్రమైన కూరగాయాలను స్థానికులకు
అందించనున్నారు. అంతేకాదు..ప్రస్తుత సంక్షోభ సమయంలో ప్రజలకు సరుకుల కొరత ఏర్పడకుండా వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖతో అల్ మీరా కలిసి పనిచేస్తోంది. ఈ
సందర్భంగా అల్ మీరా ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ యూసఫ్ అలీ అల్ ఒబైదాన్ మాట్లాడుతూ తమ స్టోర్ ద్వారా సరుకుల సరఫరా ఒక్కటే ముఖ్య ఉద్దేశం కాదని, వైరస్ సోకే అవకాశాలు లేకుండా పరిశుభ్రమైన సరుకులను అందించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- IELTS కు బహ్రెయిన్ విద్యార్థులు ఆసక్తి..!
- రియాద్లో మొదటి ఈయూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రారంభం
- మోటార్సైకిల్కు నిప్పంటించిన ముగ్గురు అరెస్టు
- 2024 చివరి నాటికి యూనిఫైడ్ GCC టూరిస్ట్ వీసా
- యూఏఈలో ICSE, ISC ఫలితాలు విడుదల
- హట్టా పర్వతాల నుండి బ్రిటిష్ హైకర్ ఎయిర్ లిఫ్ట్
- అహ్మదీ గవర్నర్ను కలిసిన భారత రాయబారి
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…