కరోనాపై పోరాటంలో ఖతార్...48 గంటల్లో అల్ మీరా మార్కెట్ ఏర్పాటు
- March 17, 2020
దోహా:కరోనాపై పోరాటంలో భాగంగా గత కొద్ది రోజులుగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్న ఖతార్..ప్రజలకు నిత్యావసర సరుకులు అందించటంలోనూ అంతే వేగంగా అలర్ట్నేట్
యాక్షన్స్ తీసుకుంటుంది. వైరస్ భయంతో షాపులు కూడా మూత పడుతుండటంతో ముకైనిస్ ప్రాంతంలో అల్ మీరా కొత్త తాత్కాలిక శాఖను ప్రారంభించింది. అల్ మీరా
కన్సూమర్ గూడ్స్ కేవలం 48 గంటల్లోనే స్టోర్ ను ప్రారంభించటం విశేషం. ఈ స్టోర్ ద్వారా స్థానికులకు పరిశుభ్ర పరిచిన సరుకులు, శుభ్రమైన కూరగాయాలను స్థానికులకు
అందించనున్నారు. అంతేకాదు..ప్రస్తుత సంక్షోభ సమయంలో ప్రజలకు సరుకుల కొరత ఏర్పడకుండా వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖతో అల్ మీరా కలిసి పనిచేస్తోంది. ఈ
సందర్భంగా అల్ మీరా ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ యూసఫ్ అలీ అల్ ఒబైదాన్ మాట్లాడుతూ తమ స్టోర్ ద్వారా సరుకుల సరఫరా ఒక్కటే ముఖ్య ఉద్దేశం కాదని, వైరస్ సోకే అవకాశాలు లేకుండా పరిశుభ్రమైన సరుకులను అందించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







