15 ఏళ్లకు స్వగ్రామం చేరనున్న వలస కార్మికుడు
- March 18, 2020
షార్జా:ఉన్న ఊరిలో ఉపాధి కరువై కుటుంబ పోషణ కోసం వేలాది రూపాయలు అప్పు చేసి దుబాయ్ వెళ్లిన వలస కార్మికుడు ఏజెంట్ చేతిలో మోసపోయాడు.వివరాల్లోకి వెళితే... తెలంగాణకు చెందిన రాజన్న సిరిసిల్లా జిల్లా,కొనరావుపేట మండలం,ఎగ్లాసుపూర్ గ్రామానికి చెందిన దొబ్బల దుర్గయ్య ఉపాధికోసం 2005 లో రూ.80 వేలు అప్పు చేసి ఏజెంట్ ద్వారా దుబాయ్ వెళ్ళాడు.దుబాయ్ విమానాశ్రయంలో పాస్పోర్ట్ ను ఏజెంట్ తీసుకుని వదిలేశారు.దీంతో దుర్గయ్య వీసా లేక ఇల్లీగల్ గా పనిచేశాడు.యూ.ఏ.ఈ ప్రభుత్వం ఆమ్నెస్టీకి అవకాశమిచ్చినా తెలియక వినియోగించలేకపోయాడు.6 నెలల కిందట ఇంటికి తిరిగి రావటానికి యూ.ఏ.ఈ ప్రభుత్వాన్ని ఆశ్రయించగా 15 ఏళ్ళ పాటు ఇల్లీగల్ గా పనిచేసినందుకు 27,255 దిర్హాములు(రూ.5.5) లక్షలు జరిమానా విధించింది.జరిమానా చెల్లించే పరిస్థితి లేక నిరుత్సాహంగా ఉన్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఇండియన్ పీపుల్స్ ఫోరమ్ వైస్ ప్రెసిడెంట్ జనగామ శ్రీనివాస్ వెంటనే స్పందించి దుర్గయ్య సమస్యను యూ.ఏ.ఈ-వాలంటీర్స్ కమిటీ ఇంచార్జి గిరీష్ పంత్ కు వివరించారు.ఆయన యూ.ఏ.లోని ఇండియన్ కాన్సులేట్ కార్యాలయం అధికారులతో మాట్లాడి దుర్గయ్యకు విధించిన జరిమానా రద్దు చేయించారు.
స్వగ్రామం రావటానికి విమాన టికెట్ కూడా ఏర్పాటు చేశారు.రెండు రోజుల్లో స్వగ్రామం రానుండటంతో కుటుంబ సభ్యులు మరియు గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!







