యూఏఈ:4 వారాల పాటు మసీదుల మూసివేత, సామూహిక ప్రార్ధనలపై నిషేధం

- March 18, 2020 , by Maagulf
యూఏఈ:4 వారాల పాటు మసీదుల మూసివేత, సామూహిక ప్రార్ధనలపై నిషేధం

యూఏఈ:కరోనా మహమ్మారి ప్రభావం ప్రార్ధనా మందిరాలపై కూడా పడింది. 4 వారాల పాటు మసీదుల్లో ప్రార్ధనలకు అనుమతి లేదని యూఏఈ స్పష్టం చేసింది. అంతేకాదు సామూహిక ప్రార్ధనలపై నిషేధం విధిస్తున్నట్లు వెల్లడించింది. గుళ్లు, చర్చీలకు కూడా ఈ నిబంధన  వర్తిస్తుందని ఇస్లామిక్ అఫైర్స్, ఎండోమెంట్స్ సాధారణ అధికార విభాగం తెలిపింది. ఈ మేరకు యూఏఈ ఫత్వా కౌన్సిల్ ఫత్వా కూడా జారీ చేసింది. కోవిడ్ వైరస్ వ్యాప్తిని కట్టడి చేయటంలో భాగంగా జాతీయ అత్యవసర విపత్తు నిర్వహణ(NCEMA), వైద్య ఆరోగ్య శాఖ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే..ప్రతి రోజు మసీదుల్లో ప్రార్ధనలు జరుగుతాయని, అజన్ ను అనుసరించి భక్తులు మాత్రం ఇళ్ల వద్దే రోజు వారి ప్రార్ధనలు నిర్వహించాలని కూడా సూచించారు. నాలుగు వారాల తర్వాత వైరస్ తీవ్రతను బట్టి పరిస్థితిని సమీక్షించుకొని అంక్షలపై తదుపరి నిర్ణయం తీసుకుంటామని కూడా తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com