యూఏఈ:4 వారాల పాటు మసీదుల మూసివేత, సామూహిక ప్రార్ధనలపై నిషేధం
- March 18, 2020
యూఏఈ:కరోనా మహమ్మారి ప్రభావం ప్రార్ధనా మందిరాలపై కూడా పడింది. 4 వారాల పాటు మసీదుల్లో ప్రార్ధనలకు అనుమతి లేదని యూఏఈ స్పష్టం చేసింది. అంతేకాదు సామూహిక ప్రార్ధనలపై నిషేధం విధిస్తున్నట్లు వెల్లడించింది. గుళ్లు, చర్చీలకు కూడా ఈ నిబంధన వర్తిస్తుందని ఇస్లామిక్ అఫైర్స్, ఎండోమెంట్స్ సాధారణ అధికార విభాగం తెలిపింది. ఈ మేరకు యూఏఈ ఫత్వా కౌన్సిల్ ఫత్వా కూడా జారీ చేసింది. కోవిడ్ వైరస్ వ్యాప్తిని కట్టడి చేయటంలో భాగంగా జాతీయ అత్యవసర విపత్తు నిర్వహణ(NCEMA), వైద్య ఆరోగ్య శాఖ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే..ప్రతి రోజు మసీదుల్లో ప్రార్ధనలు జరుగుతాయని, అజన్ ను అనుసరించి భక్తులు మాత్రం ఇళ్ల వద్దే రోజు వారి ప్రార్ధనలు నిర్వహించాలని కూడా సూచించారు. నాలుగు వారాల తర్వాత వైరస్ తీవ్రతను బట్టి పరిస్థితిని సమీక్షించుకొని అంక్షలపై తదుపరి నిర్ణయం తీసుకుంటామని కూడా తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన







