యూఏఈ:4 వారాల పాటు మసీదుల మూసివేత, సామూహిక ప్రార్ధనలపై నిషేధం
- March 18, 2020
యూఏఈ:కరోనా మహమ్మారి ప్రభావం ప్రార్ధనా మందిరాలపై కూడా పడింది. 4 వారాల పాటు మసీదుల్లో ప్రార్ధనలకు అనుమతి లేదని యూఏఈ స్పష్టం చేసింది. అంతేకాదు సామూహిక ప్రార్ధనలపై నిషేధం విధిస్తున్నట్లు వెల్లడించింది. గుళ్లు, చర్చీలకు కూడా ఈ నిబంధన వర్తిస్తుందని ఇస్లామిక్ అఫైర్స్, ఎండోమెంట్స్ సాధారణ అధికార విభాగం తెలిపింది. ఈ మేరకు యూఏఈ ఫత్వా కౌన్సిల్ ఫత్వా కూడా జారీ చేసింది. కోవిడ్ వైరస్ వ్యాప్తిని కట్టడి చేయటంలో భాగంగా జాతీయ అత్యవసర విపత్తు నిర్వహణ(NCEMA), వైద్య ఆరోగ్య శాఖ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే..ప్రతి రోజు మసీదుల్లో ప్రార్ధనలు జరుగుతాయని, అజన్ ను అనుసరించి భక్తులు మాత్రం ఇళ్ల వద్దే రోజు వారి ప్రార్ధనలు నిర్వహించాలని కూడా సూచించారు. నాలుగు వారాల తర్వాత వైరస్ తీవ్రతను బట్టి పరిస్థితిని సమీక్షించుకొని అంక్షలపై తదుపరి నిర్ణయం తీసుకుంటామని కూడా తెలిపారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







