కరోనా: తెలంగాణ మరో కీలక నిర్ణయం..

- March 18, 2020 , by Maagulf
కరోనా: తెలంగాణ మరో కీలక నిర్ణయం..

కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య ఆరుకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే స్కూళ్లు, కాలేజీలు, థియేటర్లు, షాపింగ్ మాల్స్‌‌ను నెలాఖరు దాకా మూసివేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇదే కోవలో తాజాగా ఆర్టీసీ కండక్టర్లకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఆదేశాలిచ్చింది.

ఇకపై కండక్టర్లు తప్పనిసరిగా తమ దగ్గర హ్యాండ్ శానిటైజర్లను ఉంచుకోవాలని తెలిపింది. బస్సులో ప్రయాణించే ప్రయాణీకులకు రెండు చుక్కలు వాళ్ల చేతులో వేసి రాసుకోమని సూచించాలని చెప్పింది. కండక్టర్లకు హ్యాండ్ శానిటైజర్లను ఆర్టీసీ యాజమాన్యమే సమకూర్చుతుంది. తద్వారా కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు సాధ్యమవుతుందని ప్రభుత్వం చెబుతోంది. కాగా, దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 150కు చేరుకుంటోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com