కరోనా అలర్ట్:యూఏఈకి వచ్చే వాళ్లంతా 14 స్వీయ నిర్బంధం తప్పనిసరి
- March 19, 2020
యూఏఈలోకి ప్రవేశించే ప్రతి ఒక్కరు ఇక నుంచి 14 రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండాల్సిందేనని యూఏఈ తేల్చి చెప్పింది. ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా కట్టడికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అటార్నీ జనరల్ హమద్ అల్ షంసీ వెల్లడించారు. విదేశాల నుంచి వచ్చే వారితోనే వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో యూఏఈకి ప్రవేశించే వాళ్లంతా క్వారంటైన్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, ఎవరికి వారు 14 రోజుల పాటు ఇళ్ల నుంచి కదల కూడదని ఆదేశించింది. నిబంధనలను అతిక్రమించి జనసమ్మర్ధ ప్రాంతాల్లో తిరిగినా, ఇతరులతో నేరుగా కాంటాక్ట్ అయినా, వైరస్ వ్యాప్తికి దోహదపడేలా వ్యవహరించినా పబ్లిక్ ప్రాసిక్యూషన్ చట్టాలను కఠినంగా అమలు చేస్తామని హెచ్చరించారు. స్వియ నిర్బంధం నిబంధనను పాటించని వారిని ఖైదు చేయటానికి వెనకాడబోమని అటార్నీ జనరల్ వార్నింగ్ ఇచ్చారు.
తాజా వార్తలు
- సువెందు అధికారి పిఏ హత్య–బెంగాల్లో ఉద్రిక్తత
- ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు వద్దు…డీజీపీకి సీఎం రేవంత్ స్పష్టమైన ఆదేశాలు
- విజయ్కు లైన్క్లియర్.. ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ అనుమతి..
- సీజనల్ అలెర్జీలు.. అవగాహన, నివారణ, చికిత్స పై నిపుణుల సూచనలు..!!
- 2025లో యూఏఈలో 5,58,000 కొత్త డ్రైవర్లు..!!
- వీసా మినహాయింపు ఒప్పందం పై సంతకం చేసిన సౌదీ, టర్కీ..!
- భద్రతా సంబంధాలను బలోపేతానికి యూకే, బహ్రెయిన్ చర్చలు..!!
- ఇరాన్ ప్రకటనను ఖండించిన యూఏఈ..!!
- ప్రాంతీయ, అంతర్జాతీయ భద్రతపై ఒమన్, నార్వే చర్చలు..!!
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2ని ఆమోదించండి అంటూ కేంద్ర మంత్రిని కోరిన సీఎం రేవంత్









