కరోనా అలర్ట్:యూఏఈకి వచ్చే వాళ్లంతా 14 స్వీయ నిర్బంధం తప్పనిసరి

- March 19, 2020 , by Maagulf
కరోనా అలర్ట్:యూఏఈకి వచ్చే వాళ్లంతా 14 స్వీయ నిర్బంధం తప్పనిసరి

యూఏఈలోకి ప్రవేశించే ప్రతి ఒక్కరు ఇక నుంచి 14 రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండాల్సిందేనని యూఏఈ తేల్చి చెప్పింది. ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా కట్టడికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అటార్నీ జనరల్ హమద్ అల్ షంసీ వెల్లడించారు. విదేశాల నుంచి వచ్చే వారితోనే వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో యూఏఈకి ప్రవేశించే వాళ్లంతా క్వారంటైన్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, ఎవరికి వారు 14 రోజుల పాటు ఇళ్ల నుంచి కదల కూడదని ఆదేశించింది. నిబంధనలను అతిక్రమించి జనసమ్మర్ధ ప్రాంతాల్లో తిరిగినా, ఇతరులతో నేరుగా కాంటాక్ట్ అయినా, వైరస్ వ్యాప్తికి దోహదపడేలా వ్యవహరించినా పబ్లిక్ ప్రాసిక్యూషన్ చట్టాలను కఠినంగా అమలు చేస్తామని హెచ్చరించారు. స్వియ నిర్బంధం నిబంధనను పాటించని వారిని ఖైదు చేయటానికి వెనకాడబోమని అటార్నీ జనరల్ వార్నింగ్ ఇచ్చారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com