కరోనా అలర్ట్:యూఏఈకి వచ్చే వాళ్లంతా 14 స్వీయ నిర్బంధం తప్పనిసరి
- March 19, 2020
యూఏఈలోకి ప్రవేశించే ప్రతి ఒక్కరు ఇక నుంచి 14 రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండాల్సిందేనని యూఏఈ తేల్చి చెప్పింది. ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా కట్టడికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అటార్నీ జనరల్ హమద్ అల్ షంసీ వెల్లడించారు. విదేశాల నుంచి వచ్చే వారితోనే వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో యూఏఈకి ప్రవేశించే వాళ్లంతా క్వారంటైన్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, ఎవరికి వారు 14 రోజుల పాటు ఇళ్ల నుంచి కదల కూడదని ఆదేశించింది. నిబంధనలను అతిక్రమించి జనసమ్మర్ధ ప్రాంతాల్లో తిరిగినా, ఇతరులతో నేరుగా కాంటాక్ట్ అయినా, వైరస్ వ్యాప్తికి దోహదపడేలా వ్యవహరించినా పబ్లిక్ ప్రాసిక్యూషన్ చట్టాలను కఠినంగా అమలు చేస్తామని హెచ్చరించారు. స్వియ నిర్బంధం నిబంధనను పాటించని వారిని ఖైదు చేయటానికి వెనకాడబోమని అటార్నీ జనరల్ వార్నింగ్ ఇచ్చారు.
తాజా వార్తలు
- సౌదీ చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- ఇరాక్ భూభాగం నుంచి ప్రయోగించిన డ్రోన్లను కూల్చివేసిన సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థ
- తెలంగాణ ప్రభుత్వం ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ జీవో జారీ
- 14వ ఐటీ బోనాలు ఘనంగా నిర్వహించిన టిటా
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!







