రియాద్:సౌదీ నుంచి భారత్ చేరుకున్న ఉమ్రా భక్తుల చివరి బృందం
- March 19, 2020
భారత్ నుంచి సౌదీ వెళ్లిన ఉమ్రా భక్తుల చివరి బృందం ఎట్టకేలకు ముంబై చేరుకుంది. బుధవారం మధ్యహ్నం కింగ్ అబ్దుల్లాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి స్పెషల్ ఇండిగో ఫ్లైట్ ద్వారా 185 మంది భక్తుల బృందం ముంబై చేరుకుంది. నిజానికి వీళ్లంతా మార్చి 28న ఇండియాకు తిరుగు ప్రయాణం అవ్వాల్సి ఉంది. కానీ, కరోనా ప్రభావంతో సౌదీ అరేబియా విదేశీ భక్తులపై పలు అంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఉమ్రాను పూర్తిగా రద్దు చేసింది. అలాగే పవిత్ర మదీనా మసీదులో సామూహిక ప్రార్ధనలను నిలిపివేసింది. ప్రార్ధనా మందిరాల్లోకి నిషేధం విధించింది. అంతేకాదు..మార్చి 15 నుంచి అన్ని అంతర్జాతీయ ఫ్లైట్ సర్వీసులను రద్దు చేసింది. దీంతో సౌదీలోని తమ పౌరులను తీసుకువెళ్లేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని, అందుకు అనుగుణంగా ఆయా దేశాల రాయబార కార్యలయాలు, ఏవియేషన్ కంపెనీలు సమన్వయం చేసుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలోనే విడతలుగా వెళ్లిన 3,035 మంది ఉమ్రా భక్తులను బృందాలుగా భారత్ ప్రత్యేక విమానాల ద్వారా భారత్ తీసుకొచ్చింది. ఇందులో భాగంగా బుధవారం చివరి బృందం ముంబై చేరుకుంది.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







