రియాద్:సౌదీ నుంచి భారత్ చేరుకున్న ఉమ్రా భక్తుల చివరి బృందం
- March 19, 2020
భారత్ నుంచి సౌదీ వెళ్లిన ఉమ్రా భక్తుల చివరి బృందం ఎట్టకేలకు ముంబై చేరుకుంది. బుధవారం మధ్యహ్నం కింగ్ అబ్దుల్లాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి స్పెషల్ ఇండిగో ఫ్లైట్ ద్వారా 185 మంది భక్తుల బృందం ముంబై చేరుకుంది. నిజానికి వీళ్లంతా మార్చి 28న ఇండియాకు తిరుగు ప్రయాణం అవ్వాల్సి ఉంది. కానీ, కరోనా ప్రభావంతో సౌదీ అరేబియా విదేశీ భక్తులపై పలు అంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఉమ్రాను పూర్తిగా రద్దు చేసింది. అలాగే పవిత్ర మదీనా మసీదులో సామూహిక ప్రార్ధనలను నిలిపివేసింది. ప్రార్ధనా మందిరాల్లోకి నిషేధం విధించింది. అంతేకాదు..మార్చి 15 నుంచి అన్ని అంతర్జాతీయ ఫ్లైట్ సర్వీసులను రద్దు చేసింది. దీంతో సౌదీలోని తమ పౌరులను తీసుకువెళ్లేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని, అందుకు అనుగుణంగా ఆయా దేశాల రాయబార కార్యలయాలు, ఏవియేషన్ కంపెనీలు సమన్వయం చేసుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలోనే విడతలుగా వెళ్లిన 3,035 మంది ఉమ్రా భక్తులను బృందాలుగా భారత్ ప్రత్యేక విమానాల ద్వారా భారత్ తీసుకొచ్చింది. ఇందులో భాగంగా బుధవారం చివరి బృందం ముంబై చేరుకుంది.
తాజా వార్తలు
- అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో ఘనంగా సుందరకాండ ప్రవచన జ్ఞాన యజ్ఞం ప్రారంభం
- డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం: సీపీ సుమతి
- రాజీనామా చేయనంటు మొండికేసిన మమతా బెనర్జీ..గవర్నర్ సంచలన నిర్ణయం
- పరిపాలనలో కొత్త విధానానికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు
- దుబాయ్లో షేర్డ్ హౌసింగ్ చట్టం: త్వరలో ప్రారంభం కానున్న షేరింగ్ పర్మిట్ దరఖాస్తులు
- డ్రగ్స్ కట్టడి చేయడమే తొలి ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- ముంబై కుటుంబం మృతి కేసులో వీడిన మిస్టరీ!
- అమరావతిలో KIMS ఆసుపత్రి!
- ప్రధాని మోడీ పర్యటన..బీజేపీకి బూస్ట్ ఇస్తుందా?
- కొండగట్టు అంజన్న ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు









