రియాద్:సౌదీ నుంచి భారత్ చేరుకున్న ఉమ్రా భక్తుల చివరి బృందం
- March 19, 2020
భారత్ నుంచి సౌదీ వెళ్లిన ఉమ్రా భక్తుల చివరి బృందం ఎట్టకేలకు ముంబై చేరుకుంది. బుధవారం మధ్యహ్నం కింగ్ అబ్దుల్లాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి స్పెషల్ ఇండిగో ఫ్లైట్ ద్వారా 185 మంది భక్తుల బృందం ముంబై చేరుకుంది. నిజానికి వీళ్లంతా మార్చి 28న ఇండియాకు తిరుగు ప్రయాణం అవ్వాల్సి ఉంది. కానీ, కరోనా ప్రభావంతో సౌదీ అరేబియా విదేశీ భక్తులపై పలు అంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఉమ్రాను పూర్తిగా రద్దు చేసింది. అలాగే పవిత్ర మదీనా మసీదులో సామూహిక ప్రార్ధనలను నిలిపివేసింది. ప్రార్ధనా మందిరాల్లోకి నిషేధం విధించింది. అంతేకాదు..మార్చి 15 నుంచి అన్ని అంతర్జాతీయ ఫ్లైట్ సర్వీసులను రద్దు చేసింది. దీంతో సౌదీలోని తమ పౌరులను తీసుకువెళ్లేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని, అందుకు అనుగుణంగా ఆయా దేశాల రాయబార కార్యలయాలు, ఏవియేషన్ కంపెనీలు సమన్వయం చేసుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలోనే విడతలుగా వెళ్లిన 3,035 మంది ఉమ్రా భక్తులను బృందాలుగా భారత్ ప్రత్యేక విమానాల ద్వారా భారత్ తీసుకొచ్చింది. ఇందులో భాగంగా బుధవారం చివరి బృందం ముంబై చేరుకుంది.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







