క్షమాభిక్ష పొందిన ఖైదీల విడుదల

- March 20, 2020 , by Maagulf
క్షమాభిక్ష పొందిన ఖైదీల విడుదల

మనామా: కింగ్‌ హమాద్‌ బిన్‌ ఇసా అల్‌ ఖలీఫా ప్రసాదించిన క్షమాభిక్ష కారణంగా, పలువురు ఖైదీలు విడుదలయ్యారు. జనరల్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ రిఫార్మేషన్‌ అండ్‌ రిహాబిలిటేషన్‌ ఈ విషయాన్ని వెల్లడించింది. క్షమాభిక్ష పొందిన ఖైదీలకు వైద్య పరీక్షలు పూర్తి చేసి విడుదల చేయడం జరిగిందనీ, ఖైదీలకు కరోనా వైరస్‌ పరీక్షలు కూడా చేశామని అధికారులు తెలిపారు. మొత్తం 1486 మంది ఖైదీలు క్షమాభిక్షతో విడుదలయ్యారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఖైదీల విడుదలకు క్షమాభిక్ష ప్రసాదించారు కింగ్‌ హమాద్‌ బిన్‌ ఇసా అల్‌ ఖలీఫా.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com