అబుధాబి:ట్రాఫిక్ జరిమానాపై 50% తగ్గింపు గడువు మరో 3 నెలలు పెంపు
- March 21, 2020
అబుధాబి:ట్రాఫిక్ జరిమానాలపై 50% తగ్గింపు గడువును మరో మూడు నెలలు పొడగించినట్లు అబుధాబి అధికారులు వెల్లడించారు. వాహనదారులు తమ వాహనాలపై ఉన్న ఫైన్లను క్లియర్ చేసుకునేందుకు గత ఏడాది తొలిసారిగా తగ్గింపు ఆఫర్ ప్రకటించారు. డిసెంబర్ 22కు ముందు విధించిన ట్రాఫిక్ చలాన్లకు తగ్గింపు ప్రకటించిన విషయం తెలిసిందే. ముందుగా ప్రకటించిన డెడ్ లైన్ ప్రకారం జరిమానాల చెల్లింపు గడువు ఈ నెల 22తో ముగిస్తుంది. తగ్గింపు తో పాటు పెనాల్టీ పాయింట్స్ మినహాయింపు, వాహన ఇంపౌడ్ నిబంధనలను కూడా సడలించింది. అంతేకాదు 50% తగ్గింపు కు అర్హులు కాని వారి కోసం ఎర్లీ పేమెంట్ ఇన్సెంటీవ్ ఆఫర్ కూడా ప్రకటించింది. 60 రోజుల్లోగా ఫైన్ చెల్లిస్తే 35% తగ్గింపు, 60 రోజుల తర్వాత చెల్లిస్తే 25% తగ్గింపు వర్తించనుంది. అయితే..సీరియస్ వయోలేషన్ కు పాల్పడని వాహనదారులకు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుందని కూడా గతంలోనే క్లారిటీ అధికారులు క్లారిటీ ఇచ్చారు. అయితే..వాహనదారులకు మరింత వెసులుబాటు కల్పించేలా తగ్గింపు గడువును జూన్ 22 వరకు పొడగించారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







