అబుధాబి:ట్రాఫిక్ జరిమానాపై 50% తగ్గింపు గడువు మరో 3 నెలలు పెంపు
- March 21, 2020
అబుధాబి:ట్రాఫిక్ జరిమానాలపై 50% తగ్గింపు గడువును మరో మూడు నెలలు పొడగించినట్లు అబుధాబి అధికారులు వెల్లడించారు. వాహనదారులు తమ వాహనాలపై ఉన్న ఫైన్లను క్లియర్ చేసుకునేందుకు గత ఏడాది తొలిసారిగా తగ్గింపు ఆఫర్ ప్రకటించారు. డిసెంబర్ 22కు ముందు విధించిన ట్రాఫిక్ చలాన్లకు తగ్గింపు ప్రకటించిన విషయం తెలిసిందే. ముందుగా ప్రకటించిన డెడ్ లైన్ ప్రకారం జరిమానాల చెల్లింపు గడువు ఈ నెల 22తో ముగిస్తుంది. తగ్గింపు తో పాటు పెనాల్టీ పాయింట్స్ మినహాయింపు, వాహన ఇంపౌడ్ నిబంధనలను కూడా సడలించింది. అంతేకాదు 50% తగ్గింపు కు అర్హులు కాని వారి కోసం ఎర్లీ పేమెంట్ ఇన్సెంటీవ్ ఆఫర్ కూడా ప్రకటించింది. 60 రోజుల్లోగా ఫైన్ చెల్లిస్తే 35% తగ్గింపు, 60 రోజుల తర్వాత చెల్లిస్తే 25% తగ్గింపు వర్తించనుంది. అయితే..సీరియస్ వయోలేషన్ కు పాల్పడని వాహనదారులకు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుందని కూడా గతంలోనే క్లారిటీ అధికారులు క్లారిటీ ఇచ్చారు. అయితే..వాహనదారులకు మరింత వెసులుబాటు కల్పించేలా తగ్గింపు గడువును జూన్ 22 వరకు పొడగించారు.
తాజా వార్తలు
- భారత బంగారం దిగుమతి సుంకాల పెంపుతో యూఏఈ జ్యువెలరీ మార్కెట్కు ఊతం
- వెనెజువెలా పై ట్రంప్ పోస్టు..51వ రాష్ట్రం అంటూ దుమారం
- హిజాబ్ పై నిషేధాన్ని ఎత్తివేసిన కర్ణాటక ప్రభుత్వం..ఉత్తర్వులు జారీ
- రియాద్లో ఉచిత హృదయ వైద్య శిబిరం
- అస్వస్థతతో సోనియా గాంధీ ఆస్పత్రిలో చేరిక..
- బక్రీద్ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కట్టుదిట్టమైన నిఘా: డీజీపీ ఆనంద్
- ఇరాన్కు అమెరికా ఆర్థిక షాక్: రూ.145 కోట్ల బహుమతి ప్రకటన!
- భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ (BSG)ను మరింతగా విస్తరించాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- దుబాయ్లోని కీలక ప్రదేశాలలో కర్బ్, పోల్ పార్కింగ్ కెమెరాలు..!!
- దోహా ఫిల్మ్ ఫెస్టివల్ 2026.. షార్ట్ ఫిల్మ్ లకు ఆహ్వానం..!!









