అబుధాబి:ట్రాఫిక్ జరిమానాపై 50% తగ్గింపు గడువు మరో 3 నెలలు పెంపు
- March 21, 2020
అబుధాబి:ట్రాఫిక్ జరిమానాలపై 50% తగ్గింపు గడువును మరో మూడు నెలలు పొడగించినట్లు అబుధాబి అధికారులు వెల్లడించారు. వాహనదారులు తమ వాహనాలపై ఉన్న ఫైన్లను క్లియర్ చేసుకునేందుకు గత ఏడాది తొలిసారిగా తగ్గింపు ఆఫర్ ప్రకటించారు. డిసెంబర్ 22కు ముందు విధించిన ట్రాఫిక్ చలాన్లకు తగ్గింపు ప్రకటించిన విషయం తెలిసిందే. ముందుగా ప్రకటించిన డెడ్ లైన్ ప్రకారం జరిమానాల చెల్లింపు గడువు ఈ నెల 22తో ముగిస్తుంది. తగ్గింపు తో పాటు పెనాల్టీ పాయింట్స్ మినహాయింపు, వాహన ఇంపౌడ్ నిబంధనలను కూడా సడలించింది. అంతేకాదు 50% తగ్గింపు కు అర్హులు కాని వారి కోసం ఎర్లీ పేమెంట్ ఇన్సెంటీవ్ ఆఫర్ కూడా ప్రకటించింది. 60 రోజుల్లోగా ఫైన్ చెల్లిస్తే 35% తగ్గింపు, 60 రోజుల తర్వాత చెల్లిస్తే 25% తగ్గింపు వర్తించనుంది. అయితే..సీరియస్ వయోలేషన్ కు పాల్పడని వాహనదారులకు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుందని కూడా గతంలోనే క్లారిటీ అధికారులు క్లారిటీ ఇచ్చారు. అయితే..వాహనదారులకు మరింత వెసులుబాటు కల్పించేలా తగ్గింపు గడువును జూన్ 22 వరకు పొడగించారు.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







