అబుధాబి:ట్రాఫిక్ జరిమానాపై 50% తగ్గింపు గడువు మరో 3 నెలలు పెంపు
- March 21, 2020
అబుధాబి:ట్రాఫిక్ జరిమానాలపై 50% తగ్గింపు గడువును మరో మూడు నెలలు పొడగించినట్లు అబుధాబి అధికారులు వెల్లడించారు. వాహనదారులు తమ వాహనాలపై ఉన్న ఫైన్లను క్లియర్ చేసుకునేందుకు గత ఏడాది తొలిసారిగా తగ్గింపు ఆఫర్ ప్రకటించారు. డిసెంబర్ 22కు ముందు విధించిన ట్రాఫిక్ చలాన్లకు తగ్గింపు ప్రకటించిన విషయం తెలిసిందే. ముందుగా ప్రకటించిన డెడ్ లైన్ ప్రకారం జరిమానాల చెల్లింపు గడువు ఈ నెల 22తో ముగిస్తుంది. తగ్గింపు తో పాటు పెనాల్టీ పాయింట్స్ మినహాయింపు, వాహన ఇంపౌడ్ నిబంధనలను కూడా సడలించింది. అంతేకాదు 50% తగ్గింపు కు అర్హులు కాని వారి కోసం ఎర్లీ పేమెంట్ ఇన్సెంటీవ్ ఆఫర్ కూడా ప్రకటించింది. 60 రోజుల్లోగా ఫైన్ చెల్లిస్తే 35% తగ్గింపు, 60 రోజుల తర్వాత చెల్లిస్తే 25% తగ్గింపు వర్తించనుంది. అయితే..సీరియస్ వయోలేషన్ కు పాల్పడని వాహనదారులకు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుందని కూడా గతంలోనే క్లారిటీ అధికారులు క్లారిటీ ఇచ్చారు. అయితే..వాహనదారులకు మరింత వెసులుబాటు కల్పించేలా తగ్గింపు గడువును జూన్ 22 వరకు పొడగించారు.
తాజా వార్తలు
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్
- President of Senegal receives Al Zeyoudi in Dakar to discuss expanding trade and investment partnership
- యువత కోసం ట్రావెల్-ఫస్ట్ డిజిటల్ కార్డు
- ఢిల్లీలో భారీ వర్షాలు..ఎయిర్పోర్ట్లో వరద నీరు
- సౌదీ అరేబియాలో కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పర్యటన
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ







