హైదరాబాద్:తెలంగాణలో తొలి కంటాక్ట్ కరోనా కేసు నమోదు..భయాందోళనలో ప్రజలు
- March 21, 2020
తెలంగాణలో రోజులు గడుస్తున్న కొద్ది కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తూ వస్తోంది. ఒకటి రెండు కేసుల నుంచి ఏకంగా 21 మందికి కరోనా వైరస్ సోకింది. అంతేకాదు తెలంగాణలో తొలి కాంటాక్ట్ కరోనా కేసు నమోదైంది. దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తి నుంచి 35 ఏళ్ల హైదరాబాద్ వ్యక్తికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో తెలంగాణ వ్యక్తికి కరోనా సోకినట్లు ప్రకటించింది. ఈ నెల 14న దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తి హోమ్ క్వారంటైన్ లో ఉండాల్సి ఉన్నా అతను మాత్రం పట్టించుకోలేదు. 17 వరకు అతను జనం మధ్యనే ఉన్నాడు. 17న కరోనా లక్షణాలు కనిపించటంతో ఆస్పత్రిలో చేరగా..19న కరోనా పాజిటీవ్ గా నిర్ధారణ అయ్యింది. అయితే..స్నేహంగా మెలిగిన 35 ఏళ్ల వ్యక్తికి కూడా కరోనా లక్షణాలు కనిపించటంతో నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. దీంతో అతనికి కూడా పాజిటీవ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. తెలంగాణలో ఇదే తొలి కాంటాక్ట్ కరోనా కేసు. దీంతో వైరస్ విస్తృతి చెందుతుందనే అనుమానం వైద్యులకు ఆందోళన కలిగిస్తోంది.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







