ఒమన్:పుకార్లు సృష్టిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు
- March 22, 2020
ఒమన్:పుకార్లు సృష్టించినా, సోషల్ మీడియా లేదా ఇతర మాధ్యమాల ద్వారా ప్రచారం చేసినా చట్టపరమైన చర్యలు తప్పవని ప్రభుత్వ కమ్యూనికేషన్ కేంద్రం హెచ్చరించింది. ప్రజా జీవనానికి భంగం కలిగించే ఏ చర్యలను ఉపేక్షించబోమని స్పష్టం చేసింది. సాంకేతిక సమాచార నిబంధనలు ఉల్లంఘించేలా వ్యవహరించకూడదని అధికారులు సూచించారు. మతపరమైన విలువలను కించపరిచేలా, ప్రజా జీవనానికి భంగం కలిగించేలా అపోహలు, అసత్య ప్రచారాలు సృష్టించినా, ప్రచారం చేసినా చట్ట ఉల్లంఘన కిందకు వస్తుందని ప్రభుత్వ కమ్యూనికేషన్ కేంద్రం వెల్లడించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై నెలకు తగ్గకుండా మూడు నెలలకు మించకుండా జైలు శిక్ష తప్పదని అధికారులు హెచ్చరించారు. అలాగే OMR1,000 కి తగ్గకుండా OMR3000కి ఎక్కువ కాకుండా జరిమానా విధిస్తామని కూడా అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!
- ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై సౌదీ–గ్రీస్ చర్చలు..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ పనిష్ మెంట్స్ పై విద్యాశాఖ కీలక ఆదేశాలు..!!







