ఒమన్:పుకార్లు సృష్టిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు
- March 22, 2020
ఒమన్:పుకార్లు సృష్టించినా, సోషల్ మీడియా లేదా ఇతర మాధ్యమాల ద్వారా ప్రచారం చేసినా చట్టపరమైన చర్యలు తప్పవని ప్రభుత్వ కమ్యూనికేషన్ కేంద్రం హెచ్చరించింది. ప్రజా జీవనానికి భంగం కలిగించే ఏ చర్యలను ఉపేక్షించబోమని స్పష్టం చేసింది. సాంకేతిక సమాచార నిబంధనలు ఉల్లంఘించేలా వ్యవహరించకూడదని అధికారులు సూచించారు. మతపరమైన విలువలను కించపరిచేలా, ప్రజా జీవనానికి భంగం కలిగించేలా అపోహలు, అసత్య ప్రచారాలు సృష్టించినా, ప్రచారం చేసినా చట్ట ఉల్లంఘన కిందకు వస్తుందని ప్రభుత్వ కమ్యూనికేషన్ కేంద్రం వెల్లడించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై నెలకు తగ్గకుండా మూడు నెలలకు మించకుండా జైలు శిక్ష తప్పదని అధికారులు హెచ్చరించారు. అలాగే OMR1,000 కి తగ్గకుండా OMR3000కి ఎక్కువ కాకుండా జరిమానా విధిస్తామని కూడా అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







