ఒమన్:పుకార్లు సృష్టిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు
- March 22, 2020
ఒమన్:పుకార్లు సృష్టించినా, సోషల్ మీడియా లేదా ఇతర మాధ్యమాల ద్వారా ప్రచారం చేసినా చట్టపరమైన చర్యలు తప్పవని ప్రభుత్వ కమ్యూనికేషన్ కేంద్రం హెచ్చరించింది. ప్రజా జీవనానికి భంగం కలిగించే ఏ చర్యలను ఉపేక్షించబోమని స్పష్టం చేసింది. సాంకేతిక సమాచార నిబంధనలు ఉల్లంఘించేలా వ్యవహరించకూడదని అధికారులు సూచించారు. మతపరమైన విలువలను కించపరిచేలా, ప్రజా జీవనానికి భంగం కలిగించేలా అపోహలు, అసత్య ప్రచారాలు సృష్టించినా, ప్రచారం చేసినా చట్ట ఉల్లంఘన కిందకు వస్తుందని ప్రభుత్వ కమ్యూనికేషన్ కేంద్రం వెల్లడించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై నెలకు తగ్గకుండా మూడు నెలలకు మించకుండా జైలు శిక్ష తప్పదని అధికారులు హెచ్చరించారు. అలాగే OMR1,000 కి తగ్గకుండా OMR3000కి ఎక్కువ కాకుండా జరిమానా విధిస్తామని కూడా అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు, ఖతార్ ఎమిర్ మధ్య టెలిఫోన్ సంభాషణ
- చైనా గడ్డ పై కాలుమోపిన ట్రంప్...
- హైదరాబాద్లో ఉబెర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విస్తరణ
- మహిళల టీ20 వరల్డ్కప్కు రికార్డు స్థాయిలో టికెట్ అమ్మకాలు
- BRICS విదేశాంగ మంత్రుల సమావేశానికి ఢిల్లీ చేరుకున్న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ
- ఉత్తమ ప్రతిభావంతులైన జర్నలిస్టులకు అవార్డులు- 2025-26
- మచిలీపట్నం–రేపల్లె రైల్వే లైన్కు త్వరలో ఆమోదం
- తిరుపతిని 'గ్లోబల్ టూరిస్ట్ హబ్'గా తీర్చిదిద్దుతాం: మంత్రి కందుల దుర్గేష్
- భారత బంగారం దిగుమతి సుంకాల పెంపుతో యూఏఈ జ్యువెలరీ మార్కెట్కు ఊతం
- వెనెజువెలా పై ట్రంప్ పోస్టు..51వ రాష్ట్రం అంటూ దుమారం









