కోవిడ్ 19: యూఏఈలో విద్య మాత్రం ఆగదన్న షేక్ మొహమ్మద్
- March 23, 2020
స్కూళ్ళు మూతపడ్డాయి.. యూనివర్సిటీలు మూతపడ్డాయి.. కానీ, చదువు మాత్రం ఆగదని యూఏఈ ప్రధాని, వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ రూలర్ 'షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూం' చెప్పారు. ఈ మేరకు షేక్ మొహమ్మద్ ట్విట్టర్లో ఓ ఆసక్తికరమైన ఫొటోని పోస్ట్ చేశారు. ఓ స్కూల్లో ఇ-లెర్నింగ్ సెషన్కి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారాయన. తొలి వర్చువల్ స్కూల్ డే సందర్భంగా ఓ పబ్లిక్ స్కూల్లో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యాననీ, ఒక మిలియన్కి పైగా విద్యార్థులు వర్చువల్ స్కూల్తో కనెక్ట్ అయ్యారనీ చెప్పారాయన. దేశవ్యాప్తంగా ఒక మిలియన్ మందికి పైగా విద్యార్థులు ఇ-లెర్నింగ్ ద్వారా విద్యనభ్యసిస్తున్నారనీ, కరోనా ఎఫెక్ట్కి ఈ రకంగా చెక్ చెప్పామని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- ఈనెల 19 నుంచి హార్ముజ్ పూర్తిగా ఓపెన్–ట్రంప్
- 3D మెరైన్ సర్వే ప్రాజెక్ట్ కోసం కొత్త వర్క ఏరియా:కోస్ట్ గార్డ్
- యూఏఈలో మొహర్రం ఆరంభం..!!
- కువైట్ T4 టెర్మినల్ ద్వారా ఆపరేషన్స్ పునఃప్రారంభం..!!
- MENAలో అత్యంత శాంతియుత దేశంగా ఖతార్..!!
- బురైదాలో నలుగురి ప్రాణాలను కాపాడిన సౌదీ బాలుడు..!!
- ఒమన్ లో పిల్లల సోషల్ మీడియా వినియోగం పై అధ్యయనం..!!
- ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- ఢిల్లీ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ను ప్రశ్నించిన పవన్ కల్యాణ్!
- సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్తో సీఎం చంద్రబాబు భేటీ









