కరోనావైరస్: విదేశీ విద్యార్థులందరినీ స్వదేశానికి పంపించనున్న యూఏఈ

- March 24, 2020 , by Maagulf
కరోనావైరస్: విదేశీ విద్యార్థులందరినీ స్వదేశానికి పంపించనున్న యూఏఈ

కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు ప్రయాణ ఆంక్షలను కఠినతరం చేస్తున్నాయి. అదే కోవలో యూఏఈ సైతం 48 గంటల్లో విదేశాలకు చెందిన ఎమిరాతీ విద్యార్థులందరినీ స్వదేశానికి తీసుకురానున్నట్టు విద్యా మంత్రిత్వ శాఖ మరియు నేషనల్ అథారిటీ ఫర్ ఎమర్జెన్సీ, క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ తెలిపారు. అలాగే యూఏఈ లో విద్యనభ్యసిస్తున్న ఇతర దేశ విద్యార్థులను కూడా తమ స్వదేశాలకు పంపించేస్తున్నారు. సంబంధిత దేశాల్లోని రాయబార కార్యాలయాల సహకారంతో ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు అబుధాబి మీడియా కార్యాలయం ట్విట్టర్‌లో తెలిపింది.

విదేశాలలో ఉన్న ఎమిరాతీలు తమ పాఠశాలలు మూతబడినా లేదా అధికారులు తమ దేశాలకు వెళ్లాలని సూచించినా, వెంటనే యూఏఈ కు తిరిగి రావాలని మంత్రిత్వ శాఖ గతంలో సూచించాయి. తిరిగి వచ్చే విద్యార్థులు యూఏఈ నుండి పరిమిత కాలానికి/ ప్రస్తుత సెమిస్టర్/విద్యా సంవత్సరం ముగిసే వరకు ఆన్‌లైన్‌లో దూరవిద్య చేయవలసి ఉంటుందని అధికారులు తెలిపారు. తిరిగి వచ్చిన ఎమిరాతీ విద్యార్థులు “ఎట్టి పరిస్థితుల్లోనూ” తిరిగి ప్రయాణించరాదని అధికారులు తెలిపారు. యుఎస్, యుకె మరియు ఐరోపాలో క్యాంపస్‌లలో విద్యనభ్యసిస్తున్న యూఏఈ విద్యార్థులు ఇప్పటికే మిడ్-సెమిస్టర్ కోర్సులను విడిచిపెట్టి యూఏఈ రావటం జరిగిందని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com