కువైట్ సిటీ : ధరల నియంత్రణకు షాప్స్, సూపర్ మార్కెట్లపై అధికారుల పర్యవేక్షణ
- March 25, 2020కరోనా వైరస్ కారణంగా సరుకుల కొరతను సొమ్ము చేసుకోవాలనే వ్యాపారులపై కామర్స్, పరిశ్రమల మంత్రిత్వ శాఖ అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. ధరల నియంత్రణకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా తనఖీ టీమ్స్ దాదాపు 151 సహాకార సంఘాలు, సూపర్ మార్కెట్లు, వ్యాపార దుకాణాలు, కూరగాయల షాపులను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. వినియోగదారులకు తగిన ధరల్లో నిత్యావసర సరుకులు అందించటమే లక్ష్యంగా తమ తనిఖీలు కొనసాగుతూనే ఉంటాయని వారు వెల్లడించారు. అంతేకాదు లబ్ధిదారులకు సరైన విధంగా ఆహార సామాగ్రి అందించేందుకు తనిఖీ టీమ్స్ 39 క్యాటరింగ్ బ్రాంచులను టేకోవర్ చేసుకున్నాయి. అలాగే 8 బేకరిలను కూడా తమ శాఖకు అనుసంధానం చేశాయి. ఇప్పటివరకు అత్యవసర సేవా కేంద్రానికి 135 హాట్ లైన్ ద్వారా 265 ఫిర్యాదులు అందాయని అధికారులు వెల్లడించారు. ప్రస్తుత విపత్కర పరిస్థితులను సొంత లాభాలకు వాడుకోవాలని చూసే వ్యాపారుల పట్ల తాము కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ