'మనం సైతం'కు రూ.5 లక్షలు అందజేసిన దర్శకుడు వి.వి. వినాయక్
- March 25, 2020కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా షూటింగ్స్ నిలిచిపోవడంతో దినసరి వేతనంతో బతికే పేద కళాకారులు, టెక్నీషియన్స్ ఇబ్బందులు పడుతున్నారు. అలాంటివారికి సాయం చేసేందుకు డైరెక్టర్ వి.వి. వినాయక్ తన వంతు సాయం అందించేందుకు ముందుకు వచ్చారు. నటుడు కాదంబరి కిరణ్కుమార్ ఆధ్వర్యంలో నడుస్తోన్న 'మనం సైతం' ఫౌండేషన్కు రూ. 5 లక్షలు అందజేశారు. నిత్యావసర వస్తువులు కొనుక్కోవడానికి కూడా ఇబ్బందులు పడుతున్న పేద సినీ కళాకారులు, సాంకేతిక విభాగాల్లో పనిచేసే కార్మికులు మనం సైతంను సంప్రదించి, వాటిని పొందవచ్చని ఆయన తెలిపారు.
ఈ విషయాన్ని ఒక వీడియో సందేశం ద్వారా వినాయక్ వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ, "ఈరోజు అందర్నీ వణికిస్తోన్న కరోనా వైరస్ను మన ఇళ్లల్లో మనం ఉండి వణికించాలి. ఫిల్మ్ ఇండస్ట్రీలోని పేద కళాకారులు, టెక్నీషియన్లు, డాన్సర్లు, ఫైటర్లు.. ఎవరైనా కానివ్వండి.. నెల రోజుల పాటు షూటింగ్స్ లేక చాలా ఇబ్బందులు పడుతుంటారు. వాళ్లకు నిత్యావసర వస్తువులను అందజేసే నిమిత్తం నా వంతుగా రూ. 5 లక్షల చెక్కును మనం సైతం కాదంబరి కిరణ్కుమార్కు అందజేస్తున్నా. నిజంగా ఎవరికి అవసరమో వారు కాదంబరి కిరణ్ గారిని సంప్రదించి, నిత్యావసర వస్తువులను తీసుకోవాల్సిందిగా కోరుతున్నా" అని చెప్పారు. నిరంతరం పేద సినీ కళాకారుల సంక్షేమం కోసం పరితపిస్తోన్న 'మనం సైతం' ఫౌండేషన్ను ఈ సందర్భంగా వినాయక్ ప్రశంసించారు. అందుకే ఆ ఫౌండేషన్ ద్వారా తన వంతుగా ఈ చిన్న సాయాన్ని చేస్తున్నానని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్