కరోనా కట్టడికి విశాఖ ఎంపీ చేయూత
- March 27, 2020
విశాఖపట్నం:ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైస్ (కోవిడ్-19) ను భారత దేశం నుంచి పూర్తిగా తరిమెయ్యాలని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ పిలుపునిచ్చారు.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ వ్యాధి 2వ దశలోనికి ప్రవేశించిందని అన్నారు. ఈక్రమంలో ఎంపీ ఆసుపత్రులలో టెస్టింగ్ కిట్స్, మందులు, ఇతర సామగ్రి కొనుగోలు చేయుటకై తన వంతుగా ,తన సొంత నిధుల సహాయం రూ..25 లక్షలు విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ కి అందజేశారు. ఈ సందర్భంగా ఎంవీవీ మాట్లాడుతూ కరోనా వ్యాధి వ్యాప్తి నివారణకు అకుంఠిత చిత్తం తో పనిచేస్తున్న ప్రభుత్వ యంత్రాంగం పోలీసులు, వైద్యులు, ఆరోగ్య శాఖ ఉద్యోగులు, తదితరులు తీసుకుంటున్న చర్యలను అభినందించారు.. కరోనా వైరస్ వ్యాప్తి పూర్తి నివారణకు సర్వ సన్నద్థంగా జిల్లా యంత్రాంగం ఉండవలసిన అవసరాన్ని గుర్తిస్తూ, జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ కి వివరించారు. కరోనా వైరస్ ను నిరోధానికి ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలను స్వచ్చందంగా ప్రజలందరూ పాటిస్తూ వారి వారి గృహాలకు పరిమితమై వ్యాధి వ్యాప్తి నిరోధానికి ప్రజలంతా సహకరించాలని పిలుపునిచ్చారు .ప్రజలందరూ బాధ్యతగా సామాజిక దూరం పాటించాలని కోరారు. తన పార్లమెంట్ పరిధిలో ఏ సమస్య తలెత్తిన తక్షణ స్పందన ఇస్తామని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







