కరోనా ఎఫెక్ట్ : దుబాయ్ లో డ్రైవింగ్ స్కూల్స్ రెండు వారాల పాటు మూసివేత
- March 27, 2020కరోనా వైరస్ కట్టడిలో భాగంగా దుబాయ్ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. మార్చి 26 నుంచి రెండు వారాల పాటు డ్రైవింగ్ ఇన్సిట్యూట్ మూసివేస్తున్నట్లు రోడ్లు, రవాణా శాఖ(ఆర్టీఏ) అధికారులు వెల్లడించారు. అంతేకాదు డ్రైవింగ్ లైసెన్స్ కోసం లర్నింగ్ ఫైల్ ను నమోదు చేసుకునే సేవలను కూడా నిలిపివేస్తున్నట్లు ఆర్టీఏ అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి ఎమిరేట్స్ డ్రైవింగ్ స్కూల్ తమ స్టూడెంట్స్ కు మెసేజ్ లను కూడా పంపించింది. ఈ రెండు వారాల పాటు ఎలాంటి ట్రైనింగ్ క్లాసులు ఉండవని అలాగే డ్రైవింగ్ టెస్టులు కూడా నిర్వహించబోమని ఆర్టీఏ స్పష్టం చేసింది. రాత్రి వేళ నిర్వహించే శిక్షణ తరగతులను కూడా రద్దు చేశారు. అయితే www.edi.ae ద్వారా ఆన్ లైన్ డ్రైవింగ్ పాఠాలు నేర్చుకోవచ్చని తెలిపారు. ఇక డ్రైవింగ్ లైసెన్స్ కాల పరిమితి ముగిసిన వారు మార్చి 29 నుంచి వచ్చే మూడు నెలల్లో ఎప్పుడైనా స్మార్ట్ అప్లికేషన్స్ ద్వారా రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని ప్రకటించింది. కంటి పరీక్షలు, జరిమానాలు, బ్లాక్ పాయింట్స్ తో సంబంధం లేకుండా ఏడాదిలో ఎప్పుడైనా లైసెన్స్ రెన్యూవల్ చేసుకోవచ్చని ఆర్టీఐ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం