మదీనా: 6 మదీనా జిల్లాల్లో కర్ఫ్యూ పొడగింపు
- March 29, 2020
కరోనా వైరస్ కట్టడికి మదీనా ప్రిన్సిపాలిటీ తమ పరిధిలోని ప్రాంతాలపై ఆంక్షలను మరింత కఠినతరం చేసింది. ఆరు జిల్లాల్లో కర్ఫ్యూ విధించింది. శనివారం ఉదయం ఆరు గంటల నుంచే కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. అయితే..వ్యాధి విస్తరణ తీవ్రతను బట్టి కర్ఫ్యూ గడువును పొడగించాలా లేదా అనేది నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం అల్ షురయ్ బాత్, బని జుఫ్ర్, ఖుర్బాన్, అల్ జుమా జిల్లాలతో పాటు ఇస్కాన్, బని కుద్ర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూని అమలు చేస్తున్నారు. కరోనా వ్యాప్తిని నివారించేందుకు ఆయా ఆరు జిల్లాల నుంచి ప్రజలు బయటికి వెళ్లకూడదని, అలాగే ఇతరులను జిల్లాలోకి అనుమతించకూడదని ప్రిన్సిపాలిటీ అధికారులు సూచించారు. అందరూ తప్పనిసరిగా స్వీయ నిర్బంధంలోనే ఉండాలని హెచ్చరించారు. ఎవరికైనా కరోనా లక్షణాలు ఉన్నట్లైతే 937 కి కాల్ చేయాలని తెలిపారు. అయితే..నిత్యావసర సరుకులు, మెడిసిన్ కొనేందుకు మాత్రం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అనుమతించారు.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







