మదీనా: 6 మదీనా జిల్లాల్లో కర్ఫ్యూ పొడగింపు
- March 29, 2020
కరోనా వైరస్ కట్టడికి మదీనా ప్రిన్సిపాలిటీ తమ పరిధిలోని ప్రాంతాలపై ఆంక్షలను మరింత కఠినతరం చేసింది. ఆరు జిల్లాల్లో కర్ఫ్యూ విధించింది. శనివారం ఉదయం ఆరు గంటల నుంచే కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. అయితే..వ్యాధి విస్తరణ తీవ్రతను బట్టి కర్ఫ్యూ గడువును పొడగించాలా లేదా అనేది నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం అల్ షురయ్ బాత్, బని జుఫ్ర్, ఖుర్బాన్, అల్ జుమా జిల్లాలతో పాటు ఇస్కాన్, బని కుద్ర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూని అమలు చేస్తున్నారు. కరోనా వ్యాప్తిని నివారించేందుకు ఆయా ఆరు జిల్లాల నుంచి ప్రజలు బయటికి వెళ్లకూడదని, అలాగే ఇతరులను జిల్లాలోకి అనుమతించకూడదని ప్రిన్సిపాలిటీ అధికారులు సూచించారు. అందరూ తప్పనిసరిగా స్వీయ నిర్బంధంలోనే ఉండాలని హెచ్చరించారు. ఎవరికైనా కరోనా లక్షణాలు ఉన్నట్లైతే 937 కి కాల్ చేయాలని తెలిపారు. అయితే..నిత్యావసర సరుకులు, మెడిసిన్ కొనేందుకు మాత్రం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అనుమతించారు.
తాజా వార్తలు
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి







