యూఏఈ: 320 జర్మనీ పర్యాటకులను తమ స్వదేశానికి తరలింపు

- March 29, 2020 , by Maagulf
యూఏఈ: 320 జర్మనీ పర్యాటకులను తమ స్వదేశానికి తరలింపు

యూఏఈ: 'రస్ అల్ ఖైమా' విమానాశ్రయం నుండి మార్చ్ 28న వందలాది మంది జర్మనీయులను తమ దేశానికి తిరిగి వెళ్లేందుకు సహాయం అందించిన యూఏఈ ప్రభుత్వం. వీరిలో అత్యధికంగా జర్మనీయులు కాగా, రొమేనియన్, క్రొయేషియన్, కొసావన్, ఇద్దరు టర్క్స్ మరియు ముగ్గురు పోలిష్  కూడా ఉన్నారని తెలిపిన అధికారులు. ప్రయాణీకులందరికి బయలుదేరే ముందు COVID-19 పరీక్షలు చేయటం జరిగింది. 

32 మంది బ్రిటిష్ పౌరులను స్వదేశానికి పంపేందుకు యూఏఈ అధికారులు 'ఫ్లై దుబాయ్' మరియు UK రాయబార కార్యాలయానికి అనుమతి ఇచ్చారు. "32 మంది బ్రిటన్లు యూఏఈ నుండి 'ఫ్లై దుబాయ్' లో బయలుదేరారు". విమానాశ్రయాలు మూసివేయబడ్డాయి, కాని కొన్ని విమానయాన సంస్థలు బయలుదేరడానికి అనుమతి ఇవ్వబడుతున్నాయి. ఫ్లైట్ బుక్ చేయకుండా విమానాశ్రయానికి వెళ్లవద్దు. మిమ్మల్ని ఇంటికి తీసుకురావడానికి మేము యూఏఈ ప్రభుత్వం మరియు విమానయాన సంస్థలతో కలిసి పని చేస్తున్నాము” అని రాయబార కార్యాలయం ఒక ట్వీట్‌లో తెలిపింది

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com