మనస్సాక్షి
- May 21, 2015
ఒకసారి అక్బర్ మహారాజు ఉంగరం ఎక్కడో పడిపోయింది. కోట మొత్తం వెతికించినా ఎక్కడా కనిపించలేదు. అప్పుడు బీర్బల్ ని దర్బారుకు పిలిపించి 'నా ఉంగరం కనిపించడంలేదు. సేవకులు కోటంతా వెతికినా ఉపయోగం లేకుండా పోయింది. మన సభలోని వాళ్ళే ఎవరో దొంగాలించారని నా అనుమానం. ఎవరు దొంగాలించారో కనిపెట్టగలవా?' అని అడిగాడు. బీర్బల్ ఒక్క నిమిషంపాటు ఆలోచించి 'ఇది చాలా సులువైన పని మహారాజా, ఉంగరం దొంగిలించిన వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడి నుంచి తప్పించుకోవడం అసాధ్యం. ఎందుకంటే అతడి గడ్డంలో ఒక బియ్యపుగింజ ఉంటుంది. దాన్నిబట్టి ఎవరు దొంగతనం చేశారో తేలిపోతుంది. అందరి గడ్డాలూ ఒక్కసారి పరిశీలించి అసలైన దొంగను కనిపెట్టేస్తాను' అన్నాడు. ఆ మాటలు వింటూనే సభలోని ఒక వ్యక్తి భయంభయంగా తన గడ్డం తడుముకున్నాడు. అది చూసిన బీర్బల్ వెంటనే అతడిని పట్టించాడు. 'దొంగ గడ్డంలో బియ్యపుగింజ ఉందన్న విషయం నీకెలా తెలుసు?' అంటూ అక్బర్ ఆశ్చర్యంగా అడిగాడు. 'గడ్డంలో బియ్యపుగింజ ఎలా ఉంటుంది మహారాజా, తప్పు చేసిన వ్యక్తిని మనస్సాక్షి ఎప్పుడూ భయపెడుతూనే ఉంటుంది. తప్పు చేయనివాళ్ళు దొంగతనం చేసింది ఎవరా అని అటూఇటూ ఆసక్తిగా చూస్తుంటే తప్పుచేసిన వ్యక్తి భయంతో గడ్డం తడుముకున్నాడు' అంటూ అసలు సంగతి వివరించాడు. అలా తన తెలివితేటలను, సమయస్ఫూర్తితో దొంగను పట్టించడమే కాకుండా రాజు గారి ప్రశంసలూ అందుకున్నాడు బీర్బల్.
తాజా వార్తలు
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!









