‘నిజంగా మీరు ప్రజా రక్షక భటులు’
- March 31, 2020
విజయవాడ:కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా ఎక్కడా అలసిపోకుండా విధులు నిర్వరిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులకు డీజీపీ గౌతమ్ సవాంగ్ అభినందనలు తెలియజేశారు. అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో నిరంతరం సేవలందిస్తున్న పోలీసులందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర పోలీసులకు, వారి కుటుంబాలకు డీజీపీ సవాంగ్ మంగళవారం బహిరంగ లేఖ రాశారు. ‘మీరు చేస్తున్న సేవలు ఆపారమైనవి. రక్షక భటుడు అనే పేరుకు సార్ధకత జరిగింది. నిజంగా మీరు ప్రజా రక్షక భటులు. ప్రజా ప్రాణరక్షణే కింకర్తవ్యంగా భావించి సేవలందిస్తున్న సిబ్బందిని చూసి గర్వపడుతున్నాను. కరోనా కట్టడికి విధులు నిర్వహిస్తున్న పోలీసులకి అండగా నిలుస్తున్న పోలీస్ కుటుంబాలకి ధన్యవాదాలు. పోలీస్ కుటుంబాలు పరోక్షంగా చేస్తున్న త్యాగాలు మరువలేనివి. కరోనా వైరస్ ను తరిమి కొట్టడంలో ఇంకా చాలా పని ఉంది. అతి త్వరలో ఈ కరోనా మహమ్మారి ని తరిమి కొడతామని పోలీసుల తరపున రాష్ట్ర ప్రజానీకానికి నేను మాట ఇస్తున్నాను’ అని సవాంగ్ లేఖలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...







