యూఏఈ: విదేశీయులను వారి దేశాలకు తరలించేందుకు తాత్కాలిక ఫ్లైట్స్ ఏర్పాటు
- April 03, 2020యూఏఈ :విదేశీయులు, ప్రవాసీయులను వారి వారి దేశాలకు తరలించేందుకు యూఏఈ తాత్కాలిక విమాన సర్వీసులను నడపనుంది. కరోనా వైరస్ ప్రభావంతో యూఏఈ అన్ని అంతర్జాతీయ సర్వీసులను రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో అక్కడ పర్యటించేందుకు వచ్చిన విదేశీయులు యూఏఈలోనే చిక్కుకుపోయారు. మరోవైపు దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రవాసీయులు కూడా సొంత దేశాలకు వెళ్లాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో పర్యాటకులు, ప్రవాసీయులు ప్రయాణమయ్యేందుకు అంతర్జాతీయ సర్వీసుల రద్దు నిర్ణయాన్ని కొద్ది మేర సడలించింది. తాత్కాలిక ఫ్లైట్లను ఏర్పాటు చేసి దేశంలో ఉన్న విదేశీయులను సొంత ప్రాంతాలకు తరలించాలని నిర్ణయించింది. ప్రవాసీయులు ఎవరైనా యూఏఈ విడిచి వెళ్లాలని అనుకుంటే ఆయా దేశాల రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని కూడా యూఏఈ విదేశాంగ శాఖ కోరింది.
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్