యూఏఈ:స్టెరిలైజేషన్ సమయంలో రోడ్ల మీదకు వచ్చి కెమెరాకు చిక్కిన 9000 మోటరిస్టులు
- April 04, 2020
కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో వైరస్ ను కట్టడి చేసేందుకు యూఏఈ జాతీయ స్టెరిజైలేషన్ ప్రక్రియ చేపట్టిన విషయం తెలిసిందే. అయితే..స్టెరిలైజేషన్(రసాయాలతో శుభ్రపరచటం) సమయంలో ఎవరూ ఇళ్ల నుంచి రావొద్దని అధికారులు ముందస్తుగానే హెచ్చరించారు. అయితే..అధికారుల హెచ్చరికలను పట్టించుకోకుండా దాదాపు 9000 మంది మోటరిస్టులు రోడ్ల మీదకు వచ్చినట్లు షార్జా పోలీసులు తెలిపారు. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రోడ్ల మీద తిరిగిన వాహనదారులు అంతా సీసీ కెమెరాకు చిక్కారని...ఇక వాళ్లపై కేసులు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. స్టెరిలైజేషన్ సమయాల్లో చాలా మంది అధికారుల సూచనలను పాటించారని తెలిపారు.
ఇదిలాఉంటే..ఏప్రిల్ 1 తర్వాత ట్రాఫిక్స్ నిబంధనలు పాటించకుండా విధించి జరిమానాలపై 50 శాతం తగ్గింపు ఇవ్వనున్నట్లు అధికారులు వెల్లడించారు. అలాగే మార్చి 31 నాటి జరిమానాలను రద్దు చేస్తున్నట్లు షార్జా ఎగ్జిక్యూటీవ్ కౌన్సిల్ డైరెక్టర్ తెలిపారు. అయితే..తగ్గింపు డబ్బు మూడు నెలలకు వాయిదా తర్వాత పునరుద్ధరింప బడుతుందని కూడా స్పష్టం చేశారు. అంతేకాదు..వాహనాలపై బ్లాక్ పాయింట్స్ రద్దు చేయటంతో పాటు.. సీజ్ చేసిన వాహనాలను విడిచిపెడతామని వెల్లడించారు. జరిమానాల తగ్గింపు ఆటోమాటిక్ గా అప్ డేట్ అవుతుందని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!







