కరోనా అలర్ట్:భారత విదేశాంగ శాఖ మంత్రితో ఫోన్ లో మాట్లాడిన కువైట్ విదేశాంగ శాఖ మంత్రి
- April 04, 2020
కువైట్:భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ తో కువైట్ విదేశాంగ శాఖ మంత్రి షేక్ డాక్టర్ అహ్మద్ నాస్సెర్ అల్ మొహమ్మద్ అల్ సబ ఫోన్ లో మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి నేపథ్యంలో దాన్ని అరికట్టే దిశగా పరస్పర చర్యలు చేపట్టే అంశాలపై వీరిద్దరు చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరానాన్ని మరింత బలపర్చుకోవటంపైనా చర్చించినట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా తమ దేశంలో సరైన ధృవ పత్రాలు లేకుండా నివసిస్తున్న వారిని ప్రత్యేక విమానాల్లో వారి సొంత దేశాలకు తరలిస్తున్న విషయం తెలిసిందే. తొలిదశలో ఫిలిఫ్పీన్స్ దేశస్తులను తరలింపు ప్రక్రియ ప్రారంభం అవగా..ఏప్రిల్ 11 నుంచి 15 వరకు భారతకు చెందిన వారిని తరలిస్తోంది. ఈ నేపథ్యంలోనే కువైట్ విదేశాంగ శాఖ మంత్రి..భారత విదేశాంగ శాఖ మంత్రికి ఫోన్ చేసి మాట్లాడారు. ఇదిలాఉంటే..కరోనా వ్యాప్తి కట్టడిపై గత బుధవారం భారత ప్రధాని నరేంద్ర మోదీ, కువైట్ ప్రధాని శేఖ్ ఖాలీద్ అల్ సబకు ఫోన్ చేసిన విషయం తెలిసిందే. వైరస్ పై పోరాటానికి ఇరు దేశాలు పరస్పర సహకరించుకునే అంశంపై ఇరు దేశాల ప్రధానులు చర్చించారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







