కరోనా అలర్ట్:భారత విదేశాంగ శాఖ మంత్రితో ఫోన్ లో మాట్లాడిన కువైట్ విదేశాంగ శాఖ మంత్రి
- April 04, 2020
కువైట్:భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ తో కువైట్ విదేశాంగ శాఖ మంత్రి షేక్ డాక్టర్ అహ్మద్ నాస్సెర్ అల్ మొహమ్మద్ అల్ సబ ఫోన్ లో మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి నేపథ్యంలో దాన్ని అరికట్టే దిశగా పరస్పర చర్యలు చేపట్టే అంశాలపై వీరిద్దరు చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరానాన్ని మరింత బలపర్చుకోవటంపైనా చర్చించినట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా తమ దేశంలో సరైన ధృవ పత్రాలు లేకుండా నివసిస్తున్న వారిని ప్రత్యేక విమానాల్లో వారి సొంత దేశాలకు తరలిస్తున్న విషయం తెలిసిందే. తొలిదశలో ఫిలిఫ్పీన్స్ దేశస్తులను తరలింపు ప్రక్రియ ప్రారంభం అవగా..ఏప్రిల్ 11 నుంచి 15 వరకు భారతకు చెందిన వారిని తరలిస్తోంది. ఈ నేపథ్యంలోనే కువైట్ విదేశాంగ శాఖ మంత్రి..భారత విదేశాంగ శాఖ మంత్రికి ఫోన్ చేసి మాట్లాడారు. ఇదిలాఉంటే..కరోనా వ్యాప్తి కట్టడిపై గత బుధవారం భారత ప్రధాని నరేంద్ర మోదీ, కువైట్ ప్రధాని శేఖ్ ఖాలీద్ అల్ సబకు ఫోన్ చేసిన విషయం తెలిసిందే. వైరస్ పై పోరాటానికి ఇరు దేశాలు పరస్పర సహకరించుకునే అంశంపై ఇరు దేశాల ప్రధానులు చర్చించారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







