కరోనా అలెర్ట్:వచ్చేవారంలో విదేశాల్లోని కువైటీయన్ల రాక..
- April 04, 2020
కువైట్:వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన కువైటీయన్లను సొంత దేశానికి తీసుకొచ్చే ప్రక్రియ కొనసాగుతోంది. వచ్చే వారం రెండో విడతగా మరికొందరు కువైటీయన్లు స్వదేశానికి చేరుకోనున్నారు. అయితే..కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో విదేశాల నుంచి వస్తున్న వారి కోసం విమానాశ్రయాల్లోనే తాత్కాలికంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎయిర్ పోర్టుల్లో ప్రత్యేక హాళ్లు ఏర్పాటు చేసి అక్కడే వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకోసం కువైట్ ఇంటర్నేషన్ ఎయిర్ పోర్ట్ లో ప్రజా వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ముమ్మరంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. కేవలం 48 గంటల్లోనే తాత్కాలిక హాళ్లు నిర్మించి విమానాశ్రయ అధికారులకు అప్పజెప్పాల్సి ఉందని మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం తమకు కేటాయించిన ప్రదేశంలో భూమిని చదును చేస్తున్నట్లు వివరించారు. ఆ తర్వాత ఫ్లోరింగ్ పూర్తి చేసి వేగంగా హాళ్లను ఏర్పాటు పనులను పూర్తి చేస్తామని చెబుతున్నారు. ఇదిలాఉంటే కరోనా వైరస్ నేపథ్యంలో పలు దేశాలు అంతర్జాతీయ సర్వీసులను రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో చాలా మంది కువైటీయన్లు పలు దేశాల్లో చిక్కుకుపోయారు. దీంతో అయా దేశాల నుంచి వారిని దశల వారిగా కువైట్ తీసుకొస్తున్నారు. తొలి విడతలో భాగంగా గత నెల 25 నుంచి 29 మంది 11 దేశాల నుంచి 2,710 మందిని కువైట్ తీసుకొచ్చారు. రెండో విడతలో భాగంగా వచ్చే వారం మరికొందర్ని కువైట్ తీసుకొస్తున్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..