కరోనా అలెర్ట్:వచ్చేవారంలో విదేశాల్లోని కువైటీయన్ల రాక..
- April 04, 2020
కువైట్:వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన కువైటీయన్లను సొంత దేశానికి తీసుకొచ్చే ప్రక్రియ కొనసాగుతోంది. వచ్చే వారం రెండో విడతగా మరికొందరు కువైటీయన్లు స్వదేశానికి చేరుకోనున్నారు. అయితే..కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో విదేశాల నుంచి వస్తున్న వారి కోసం విమానాశ్రయాల్లోనే తాత్కాలికంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎయిర్ పోర్టుల్లో ప్రత్యేక హాళ్లు ఏర్పాటు చేసి అక్కడే వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకోసం కువైట్ ఇంటర్నేషన్ ఎయిర్ పోర్ట్ లో ప్రజా వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ముమ్మరంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. కేవలం 48 గంటల్లోనే తాత్కాలిక హాళ్లు నిర్మించి విమానాశ్రయ అధికారులకు అప్పజెప్పాల్సి ఉందని మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం తమకు కేటాయించిన ప్రదేశంలో భూమిని చదును చేస్తున్నట్లు వివరించారు. ఆ తర్వాత ఫ్లోరింగ్ పూర్తి చేసి వేగంగా హాళ్లను ఏర్పాటు పనులను పూర్తి చేస్తామని చెబుతున్నారు. ఇదిలాఉంటే కరోనా వైరస్ నేపథ్యంలో పలు దేశాలు అంతర్జాతీయ సర్వీసులను రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో చాలా మంది కువైటీయన్లు పలు దేశాల్లో చిక్కుకుపోయారు. దీంతో అయా దేశాల నుంచి వారిని దశల వారిగా కువైట్ తీసుకొస్తున్నారు. తొలి విడతలో భాగంగా గత నెల 25 నుంచి 29 మంది 11 దేశాల నుంచి 2,710 మందిని కువైట్ తీసుకొచ్చారు. రెండో విడతలో భాగంగా వచ్చే వారం మరికొందర్ని కువైట్ తీసుకొస్తున్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన







