సేమ్యా రవ్వలడ్డు
- January 25, 2016
కావలసిన పదార్థాలు : బొంబాయి రవ్వ-ఒక కేజి, సేమ్యా-350 గ్రా, చక్కెర-రెండు కేజీలు, నెయ్యి-పావు కేజి, జీడిపప్పు-100 గ్రా, కిస్మిస్-50 గ్రా, కర్బూజ విత్తనాలు-100గ్రా, కొబ్బరి-350 గ్రా, పాలు-ఒక లీటరు, యాలకులు-10 గ్రా.
తయారుచేసే విధానం : ముందుగా కొంత కొబ్బరిని తురిమి, మరికొంత కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కోసి ప్లేటులో ఉంచుకోవాలి. స్టవ్పై బాణలి ఉంచి, అందులో నెయ్యి వేసి అది వేడెక్కాక అందులో సేమ్యా వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. తరువాత నేతిలోనే కొబ్బరి ముక్కలు, బొంబాయి రవ్వ, జీడిపప్పు, కిస్మిస్ విడివిడిగా వేగించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి పాత్రను స్టవ్పై పెట్టి అందులో బొంబాయి రవ్వ, సేమ్యా, కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, కిస్మిస్, చక్కెర అన్నీ వేసి, సన్నటి మంటపై ఉంచి, మందపాటి గరిటెతో వీటన్నిటినీ బాగా కలపాలి. చక్కెర కరుగుతుండగా, కాచి చల్లార్చిన పాలను కొద్ది కొద్దిగా అందులో పోస్తూ రవ్వ ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. ఈ మిశ్రమం అంతా కాస్త దగ్గరికి అయ్యాక నెయ్యి పైకి తేలే వరకు సన్నటి మంటపై ఉడికించాలి. ఆ తరువాత యాలకుల పొడి చల్లి బాగా కలిపి దించేయాలి. వేడి తగ్గాక, అర చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ లడ్డూలు చేయాలి. ఈ లడ్డూలను ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్న కొబ్బరి తురుములో దొర్లించి పెద్ద పళ్లెంలో ఉంచి ఆరనివ్వాలి.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







